యంగ్ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న పాన్-ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాగబంధం’ ప్రస్తుతం అద్భుతమైన విజువల్ ఫీస్ట్గా రూపుదిద్దుకుంటోంది. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది కేవలం సినిమాటిక్ వండర్గా మాత్రమే కాక, డివైన్ మరియు యాక్షన్తో కూడిన భారీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ‘నాగబంధం’ టీమ్ హైదరాబాద్లోని నానక్రామగూడలో ఉన్న రామానాయుడు స్టూడియోస్లో గూస్బమ్స్ తెప్పించే క్లైమాక్స్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తోంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించేందుకు మేకర్స్ ఏకంగా ₹20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన క్లైమాక్స్ సీక్వెన్స్లలో ఇది ఒకటిగా నిలవనుంది.
ఒక మహాద్వారం చుట్టూ రూపుదిద్దుకున్న ఈ క్లైమాక్స్ సెట్ను ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ తన బృందంతో కలిసి అత్యున్నత ప్రమాణాలతో నిర్మించారు. ఈ సెట్ కథలోని భావోద్వేగం, డ్రామాను విజువల్గా అద్భుతంగా చూపించేలా డిజైన్ చేయబడింది. అద్భుతమైన యాక్షన్కు ప్రసిద్ధిగాంచిన థాయ్ స్టంట్ మాస్టర్ కేచా ఖాంఫాక్డీని ఈ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఆయన బెర్త్ టేకింగ్ యాక్షన్ కొరియోగ్రఫీతో ఈ సన్నివేశాలు గ్రాండ్గా, ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే స్టంట్స్, యాక్షన్తో విజువల్గా మైండ్బ్లోయింగ్గా ఉండబోతున్నాయి. ‘నాగబంధం’ కథ భారతదేశంలోని ప్రాచీన విష్ణు ఆలయాల నేపథ్యంపై సాగుతుంది. శతాబ్దాలుగా రహస్యంగా కొనసాగుతున్న “నాగబంధం” అనే ఆధ్యాత్మిక సంప్రదాయం చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా కథ పద్మనాభస్వామి, పూరి జగన్నాథ్ ఆలయాల ధన నిధుల మిస్టరీల స్ఫూర్తితో రూపొందింది.
ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి సౌందర్ రాజన్ S సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఆర్ సి ప్రణవ్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు అభిషేక్ నామా క్రియేటివ్ విజన్, అద్భుతమైన నటీనటులు, టెక్నికల్ టీంతో రూపొందుతున్న ‘నాగబంధం’ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. త్వరలోనే ఈ టీమ్ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించి, ఆసక్తికరమైన టీజర్లు, ఇంటరాక్టివ్ కార్యక్రమాలతో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఒక మైల్స్టోన్గా నిలవనుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
