‘తండేల్’ మూవీ సక్సెస్తో ఫుల్ ఫామ్లో ఉన్నాడు నాగాచైతన్య. ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్లో తన నెక్స్ట్ చిత్రాన్ని రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మిస్టిక్ థ్రిల్లర్గా భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. కాగా ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన వివరాలు మేకర్స్ శనివారం అధికారికంగా వీడియో తో వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. సుకుమార్ రైటింగ్స్తో కలిపి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
Also Read: Ramayana : ‘రామాయణ’ ఫస్ట్ లుక్ రిలీజ్కు గట్టిగా ప్లాన్ చేస్తున్నా మూవీ టీం..
కాగా ఎన్సీ 24 వర్కింగ్ టైటిల్ తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన వీడియో గ్లింప్స్ ఎంతో ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఇక ఈ సినిమాలో చైతూ సరికొత్త లుక్తో కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది. మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా చై పేరు మరో సినిమాలో కూడా వినిపిస్తోంది. ఎంటా మూవీ అంటే.. దర్శకుడు దేవా కట్టా తెరకెక్కిస్తున్న ‘మయసభ’ అనే సినిమాలో నాగచైతన్య నటిస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై దర్శకుడు దేవా కట్టా క్లారిటీ ఇచ్చారు..
‘నేను డైరెక్ట్ చేస్తున్న ‘మయసభ’ చిత్ర షూటింగ్ పూర్తయింది.. ఇందులో ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. సాయి కుమార్, నాజర్, దివ్యా దత్తా, తాన్య రవిచంద్రన్, రవీంద్ర విజయ్, శ్రీకాంత్ అయ్యంగార్, శత్రు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఇందులో చైతన్య రావు కూడా నటిస్తున్నాడు. ఆయన పేరును నాగ చైతన్య తో కంపేర్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అంటూ దేవా కట్టా క్లారిటీ ఇచ్చారు.