మరోసారి జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో మరో చిత్రం రూపొందనుంది. వీరిద్దరూ ఈ ఏడాది ప్రారంభంలో “దృశ్యం-3″ని ప్రకటించారు. కానీ ఇప్పుడు “దృశ్యం-3” కన్నా ముందే ఈ క్రేజీ కాంబినేషన్ లో మరో ప్రాజెక్ట్ తెరకెక్కబోతోందని తెలుస్తోంది. జీతు, మోహన్ లాల్ కాంబినేషన్ లో ఇంతకుముందు దృశ్యం, దృశ్యం 2 లాంటి సూర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇక ప్రస్తుతం మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న ‘రామ్’ చిత్రానికి జీతూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ సగభాగం పూర్తయ్యింది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. పరిస్థితులు ఓకే అయ్యాక లండన్ లో కొత్త షెడ్యూల్ తిరిగి ప్రారంభం అవుతుంది. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మూడు ప్రాజెక్ట్ లు రూపొందుతుండడం విశేషం. ఈ మూడు ప్రాజెక్ట్ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మోహన్ లాల్ నేషనల్ అవార్డు విన్నింగ్ చిత్రం ‘మరక్కర్’, యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆరట్టు’ చిత్రాల విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. మరోవైపు ‘బారోజ్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ తొలిసారిగా డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టారు. మోహన్ లాల్ ఈ చిత్రాలతో పాటు ‘లూసిఫెర్ 2’, ప్రియదర్శన్ తో మరో ప్రాజెక్ట్ లో కూడా నటించనున్నారు.
Also Read
- Tags
- Jeethu Joseph
- Mohanlal
తాజావార్తలు
-
Sonam Wangchuk Hunger Strike: 20వ రోజుకు సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష.. అవయవ వైఫల్యం ముప్పు.. దీక్ష విరమణకు ససేమిరా..
-
Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
-
School Van Hit by Train: ఘోర ప్రమాదం… స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
-
Weight Loss Side Effects: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా..?.. ఈ 7 తప్పులను మాత్రం చేయొద్దు
-
Aamir Khan: సోనమ్ వాంగ్చుక్ జీవితం ఆధారంగా ‘3 ఇడియట్స్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!