Seethakka: పుష్ప 2 సినిమాపై మంత్రి సీతక్క సంచలన కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప -2 సినిమాపై, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై, అల్లు అర్జున్ పై మంత్రి సీతక్క సంచలన కామెంట్స్ చేశారు. ఒక అభిమాని సినిమా థియేటర్ కి వెళ్తే చనిపోవడం చాలా బాధాకరమైన విషయం.చట్టానికి లోబడి హీరోపై కేసు పెట్టడం జరిగింది. మహిళ చనిపోతే ఆ సినిమా నటుడు పరామర్శించకపోవడం చాలా బాధాకరం అని సీతక్క అన్నారు. ఆ కుటుంబానికి సహాయం చేయకుండా,ఆ నటుడుని మిగతా నటులు పరామర్శిస్తున్నారు. చివరికి అభిమానే సినిమాకి వెళ్లడం తప్పు అన్నట్లు చేస్తున్నారు. నటుడు అల్లు అర్జున్ మీద కాంగ్రెస్ పార్టీకి గానీ, సీఎం రేవంత్ రెడ్డికి ఎటువంటి కోపం లేదన్న ఆమె ఇలాంటి తప్పు జరిగినప్పుడు ఒక నటుడికి అవకాశం ఇస్తే ఇంకొకరికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందన్నారు. చట్టానికి ఉన్న పరిమితులు లోబడే చట్టం తన పని చేసుకోపోతుందన్న ఆమె ప్రజలను హక్కులను కాపాడుకోవడానికి,చట్టాన్ని రక్షించుకోవాలి,చట్టబద్ధంగా ఎవరైనా శిక్షార్హులే అని అన్నారు. అతిగా ఎవరు ప్రవర్తించిన వారికి శిక్ష ఉంటుంది, ప్రజలకు భరోసా ఉంటుంది. చట్ట నియమ,నిబంధనలు అనుసరిస్తేనే శాంతి ఉంటుంది,క్రమ శిక్షణ ఉంటుందని ఆమె అన్నారు.
Honda-Nissan: హోండా, నిస్సాన్ విలీనం.. ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆటో గ్రూప్?
Also Read
- Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే 'హ్యాపీ జర్నీ'..
- Srimad Bhagavatam : 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టెక్నీషియన్లతో 7 భాగాలుగా 'శ్రీమద్భాగవతం
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
బిజెపి నాయకులను ఒకటి అడుగుతున్నా.. భారత రాజ్యాంగం వచ్చిన, దానిలోని హక్కులు చాలా మందికి తెలియవు, జై భీమ్ సినిమా అనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చింది.. అటువంటి సినిమాకి ఒక్క అవార్డు ఇవ్వలేదు,గుర్తించలేదని ఆమె అన్నారు. ఒక స్మగ్లింగ్ చేసే సినిమాకు గొప్పగా అవార్డు ఇస్తున్నారు. స్మగ్లింగ్ చేసే సినిమాలో రాజ్యాంగబద్ధంగా పనిచేసే అధికారులను బట్టలిప్పి చూపించారు, అటువంటి సినిమాలు గొప్పగా పొగుడుతారు అవార్డులు ఇస్తారని అన్నారు. సినిమాలకు సినీ కుటుంబాలకు మేము కూడా మద్దతుగా ఉంటాం.. కానీ సొంత సిబ్బందితో జనాలను ఇబ్బందులు గురి చేస్తే ఊరుకునేది లేదని ఆమె తేల్చి చెప్పారు. పేదవారు తప్పు చేస్తే కేసులు పెడుతున్నాం.. పెద్దింటి వారు తప్పు చేస్తే కేసులు పెట్టొద్దు అనడం ఇది ఎక్కడ న్యాయం అని ప్రశ్నించారు. సమాజంపై సినిమాల పాత్ర అంతగానే ఉంటుంది.. సన్మార్గమైన సినిమాలను ఆహ్వానిస్తామని అన్నారు. భారత రాజ్యాంగం ఇచ్చిన చట్టం ప్రకారం అందరూ సమానులే.. దానినే మేము అనుసరిస్తున్నామని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!