Manchu Manoj: రాచకొండ సిపి ముందు మంచు మనోజ్ బైండోవర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం కారణంగా జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నమోదైన కేసుల విషయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు 126 బిఎన్ఎస్ ప్రకారం జిల్లా అదనపు మెజిస్ట్రేట్ హోదాలో నోటీసులు జారీ చేయడం జరిగింది. దానికి స్పందిస్తూ మంచు మనోజ్ నిన్న నేరేడ్ మెట్ లోని పోలీస్ కమిషనరేట్ లో సుధీర్ బాబు ఐపీఎస్ ముందు హాజరయ్యారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో జరిగిన గొడవకు సంబంధించిన విషయాలలో మంచు మనోజ్ వాంగ్మూలం తీసుకున్నారు. కుటుంబ వివాదాలు శాంతి భద్రతల సమస్యగా మార్చకూడదని, ఇరు వర్గాలు శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. వారి కుటుంబ వివాదాల నేపథ్యంలో వారి చర్యలు సమాజంలోని ఇతర వ్యక్తులకు, ఆ చుట్టుపక్కల ప్రజల శాంతికి భంగం కలిగించే విధంగా ఉన్నట్లయితే చర్య తీసుకోవడం జరుగుతుందని మరోసారి గొడవలు జరిగితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించి సంయమనం పాటించాలని సూచించారు.
Manchu Vishnu: మంచు విష్ణుకు పోలీసులు వార్నింగ్?
Also Read
- Dil Raju: న్యాచురల్ స్టార్ నానికి రూ.110 కోట్ల ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు.. ఇది నిజమేనా?
- Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
- #BanTheCensor: ఆర్జీవీ సంచలన పోస్ట్.. "ప్రేక్షకులను చిన్నపిల్లల్లా చూడొద్దు.. సెన్సార్ బోర్డును రద్దు చేయాలి"
- Jana Nayakudu: 'జన నాయకుడు' పోస్టర్తో అంచనాలు పెంచిన విజయ్.. జూలై 23న బాక్సాఫీస్పై దండయాత్ర!
కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు మంచు మనోజ్ ఒక సంవత్సరం కాలం పాటు శాంతి కాపాడడానికి ఎలాంటి ప్రతికూల చర్యలకు దిగకుండా ప్రజాశాంతికి భంగం కలిగించకుండా ఉంటానని బాండ్ ఇవ్వడం జరిగింది. ఇదే రోజు సాయంత్రం మోహన్ బాబు పెద్ద కుమారుడు అయిన మంచు విష్ణు కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ ముందు హాజరయ్యారు అనంతరం కమిషనర్ గారికి తన తరఫు వాదనలు వినిపించి తనకు కోర్టు 24వ తేదీ వరకు ఇచ్చినటువంటి ఉత్తర్వుల గురించి తెలియజేశారు. ఈ వివాదంలో అక్కడ ఎలాంటి సమస్యలు సృష్టించవద్దు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదు అని కమిషనర్ తెలియజేసి, తర్వాత కోర్టు ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యల గురించి తెలియజేయడం జరుగుతుందని అప్పటివరకు శాంతి భద్రత ఎలాంటి విఘాతం కలిగించినా వారి మీద తగిన చర్యలు ఉంటాయని ఆదేశించారు.
తాజావార్తలు
-
World’s First Motorcycle: ప్రపంచంలో మొట్టమొదటి బైక్ను ఎవరు కనిపెట్టారు? షాకింగ్ హిస్టరీ ఇదే!
-
PM Modi: దేశ చరిత్రలో మరో కీలక ఘట్టం.. తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న మోడీ
-
TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
-
Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు సవాల్..
-
Trump: ఇరాన్పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!