సూపర్స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘వారణాసి’ (Varanasi). ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడానికి సిద్ధమవుతున్నప్పటికి.. తాజా సమచానం ప్రకారం వచ్చే జూన్ రెండో వారం నుండి ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన, సుదీర్ఘమైన యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. జూన్ సెకండ్ వీక్ నుండి స్టార్ట్ కాబోయే కొత్త షెడ్యూల్లో మహేష్ బాబుపై అంతర్జాతీయ స్టంట్ మాస్టర్ల పర్యవేక్షణలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కేవలం ఈ యాక్షన్ సీక్వెన్స్ల కోసమే సుమారు నెలకు పైగా నాన్-స్టాప్ షూటింగ్ సాగనుండటం విశేషం.
ఈ సినిమాలో మహేష్ బాబు మునుపెన్నడూ చేయని విధంగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇందులో ‘రుద్ర’.. ‘శ్రీరాముడు’ అనే రెండు పవర్ఫుల్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇక గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఈ చిత్రంలో ‘మందాకిని’ అనే కీలక పాత్రలో నటిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7, 2027న థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ గట్టి ప్లాన్తో ఉన్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో తెలుగు సినిమా జెండాను ప్రపంచవ్యాప్తంగా ఎగురవేసిన రాజమౌళి.. ఈసారి మహేష్ బాబుతో కలిసి ఏ రేంజ్ గ్లోబల్ వండర్ క్రియేట్ చేస్తారో చూడాలి!
