Manchu Lakshmi: ఎవ్వరికీ యుద్ధం ఇష్టముండదు.. కానీ కొన్ని సమయాల్లో తప్పదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం లో జరిగిన దారుణమైన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైనిక దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని పురస్కరించుకుని, హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది ప్రజలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పాల్గొని, భారత సైనికులకు సంఘీభావం తెలిపారు.
Also Read: Jayam Ravi : జయం రవి కోసం రూ.100 కోట్లు అప్పు చేశా.. సీన్ లోకి హీరో అత్త..
Also Read
- Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
- Durandhar 2 Review: ఓటీటీలోకి 'ధురంధర్: ద రివెంజ్'.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
- Peddi : వేట షురూ.. 'రాంబుజ్జి'గా దివ్యేందు సంచలన ఎంట్రీ!
- Film Chamber Meeting : 'పెద్ది' సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి సెక్రటేరియట్ జంక్షన్ ద్వారా మిలటరీ ట్యాంక్ వరకు జరిగిన ఈ ర్యాలీలో జాతీయ పతాకాలు రెపరెపలాడాయి. “భారత్ మాతా కీ జై”, “జై హింద్” నినాదాలతో ర్యాలీ వాతావరణం దేశభక్తితో నిండిపోయింది. మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సినీ నటి మరియు మాజీ ఎంపీ జయప్రద, నటి మంచు లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సినీ నటి మరియు మాజీ ఎంపీ జయప్రద మాట్లాడుతూ, “ఈ రోజు మనమంతా గర్వించదగ్గ రోజు. వేలాది మంది ప్రజలు ‘మేమున్నాం’ అంటూ భారత మాతకు జై కొట్టారు. ఈ ఆపరేషన్తో మన సైనికులు పహల్గాం బాధితుల కన్నీళ్లను తుడిచారు. మతం పేరుతో భార్యల ముందే భర్తలను చంపిన ఉగ్రవాదులకు ప్రధాని నరేంద్ర మోదీ కంటి చూపుతోనే భస్మం చేశారు,” అని అన్నారు.
Also Read:AP Liquor Scam Case: ఏసీబీ కోర్టులో కీలక వాదనలు.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి రిమాండ్ విధింపు
నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ, “ఇంత గొప్ప వేడుకకు నన్ను ఆహ్వానించడం ఆనందంగా ఉంది. మన సైనికులకు సెల్యూట్ చేయాలి. ఎవరికీ యుద్ధం ఇష్టం ఉండదు, కానీ కొన్ని సమయాల్లో అది అనివార్యం. మన దేశంలోకి చొరబడి, అమాయక ప్రజలను హతమార్చిన వారికి మోదీ ఆధ్వర్యంలో మన సైనికులు నిశ్శబ్దంగా, ఖచ్చితమైన దాడులతో జవాబు చెప్పారు. పహల్గాం బాధిత కుటుంబాల నుంచి ఇద్దరు మహిళలు ఈ ఆపరేషన్ గురించి మాట్లాడినప్పుడు నాకు గర్వంగా అనిపించింది. ఇది ఒక్కరి విజయం కాదు, మన అందరి విజయం. అమరుడైన మురళి నాయక్ను తలచుకుందాం,” అని ఉద్వేగభరితంగా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..