Manchu Lakshmi: ఎవ్వరికీ యుద్ధం ఇష్టముండదు.. కానీ కొన్ని సమయాల్లో తప్పదు!
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం లో జరిగిన దారుణమైన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైనిక దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని పురస్కరించుకుని, హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది ప్రజలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పాల్గొని, భారత సైనికులకు సంఘీభావం తెలిపారు.
Also Read: Jayam Ravi : జయం రవి కోసం రూ.100 కోట్లు అప్పు చేశా.. సీన్ లోకి హీరో అత్త..
Also Read
ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి సెక్రటేరియట్ జంక్షన్ ద్వారా మిలటరీ ట్యాంక్ వరకు జరిగిన ఈ ర్యాలీలో జాతీయ పతాకాలు రెపరెపలాడాయి. “భారత్ మాతా కీ జై”, “జై హింద్” నినాదాలతో ర్యాలీ వాతావరణం దేశభక్తితో నిండిపోయింది. మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సినీ నటి మరియు మాజీ ఎంపీ జయప్రద, నటి మంచు లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సినీ నటి మరియు మాజీ ఎంపీ జయప్రద మాట్లాడుతూ, “ఈ రోజు మనమంతా గర్వించదగ్గ రోజు. వేలాది మంది ప్రజలు ‘మేమున్నాం’ అంటూ భారత మాతకు జై కొట్టారు. ఈ ఆపరేషన్తో మన సైనికులు పహల్గాం బాధితుల కన్నీళ్లను తుడిచారు. మతం పేరుతో భార్యల ముందే భర్తలను చంపిన ఉగ్రవాదులకు ప్రధాని నరేంద్ర మోదీ కంటి చూపుతోనే భస్మం చేశారు,” అని అన్నారు.
Also Read:AP Liquor Scam Case: ఏసీబీ కోర్టులో కీలక వాదనలు.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి రిమాండ్ విధింపు
నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ, “ఇంత గొప్ప వేడుకకు నన్ను ఆహ్వానించడం ఆనందంగా ఉంది. మన సైనికులకు సెల్యూట్ చేయాలి. ఎవరికీ యుద్ధం ఇష్టం ఉండదు, కానీ కొన్ని సమయాల్లో అది అనివార్యం. మన దేశంలోకి చొరబడి, అమాయక ప్రజలను హతమార్చిన వారికి మోదీ ఆధ్వర్యంలో మన సైనికులు నిశ్శబ్దంగా, ఖచ్చితమైన దాడులతో జవాబు చెప్పారు. పహల్గాం బాధిత కుటుంబాల నుంచి ఇద్దరు మహిళలు ఈ ఆపరేషన్ గురించి మాట్లాడినప్పుడు నాకు గర్వంగా అనిపించింది. ఇది ఒక్కరి విజయం కాదు, మన అందరి విజయం. అమరుడైన మురళి నాయక్ను తలచుకుందాం,” అని ఉద్వేగభరితంగా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!