Site icon NTV Telugu

మహేశ్ బాబుతో మరో సినిమా చేయాలని వుంది

బాలీవుడ్ భామ కృతి సనన్ ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్రభాస్ కు జంటగా ‘ఆదిపురుష్’ సినిమాలో నటిస్తుంది. గతంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాలో కథానాయికగా పరిచయమైంది ఈ బ్యూటీ. తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ, మహేశ్ బాబుతో మరో సినిమా చేయాలని ఉందని పేర్కొంది. తను మొదటిసారిగా కలిసి నటించిన వ్యక్తి మహేష్ అని తెలిపింది. ఆయన అద్భుతమైన వ్యక్తి, ఆయనతో మరోసారి నటిస్తానని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆదిపురుష్ కోసం తాను ఎంత‌గానో ఎదురుచూస్తున్నాన‌ని, ఈ సినిమాలో సీత పాత్రలో న‌టించ‌టం కొత్త ఎక్స్ పీరియ‌న్స్ అని కృతి చెప్పుకొచ్చింది.

Exit mobile version