మంచు మోహన్ బాబు, మంచు విష్ణు నిర్మించి నటిస్తున్న కన్నప్ప సినిమాపై సనాతన ధర్మాన్ని, హిందూ దేవి దేవతలను, బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు మనోభావాలు దెబ్బతినే విధంగా చరిత్ర, పురాణాలు, వక్రీకరించి కన్నప్ప సినిమా నిర్మించారని బ్రాహ్మణ చైతన్య రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఏపీ హైకోర్టులో రిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే వేసవి సెలవుల తరువాత హైకోర్టు నిన్ననే ప్రారంభమైంది. ఈరోజు 17 జూన్ మంగళవారం కన్నప్ప సినిమా కేసు ఏపీ హైకోర్టులో బెంచ్ మీదకి వచ్చింది. ఈ క్రమంలో సెంట్రల్ ఫిలిం బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్ ముంబై తరఫున అడ్వకేట్ హాజరు కావడం జరిగింది. వారి తరపున ఉన్న అడ్వకేట్ కన్నప్ప సినిమా సెన్సార్ కాకుండా గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్ని అవరోధాలు అయినా సరే ఈనెల 27న సినిమా రిలీజ్ చేస్తామని తెలియజేసిన అంశంపై పత్రికల్లో వచ్చిన వార్తలను న్యాయస్థానం ముందు ఉంచారు.
Also Read:V. Hanumantha Rao: మోడీ బీసీ అయ్యుండి.. కుల గణన చేయడానికి ఆలోచిస్తున్నారు!
వెంటనే ఫిలిం సెన్సార్ బోర్డు పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా సెన్సార్ స్క్రూట్ని కూడా కాకుండా, సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా, హైకోర్టులో కౌంటర్ వేయకుండా సినిమా తేదీ ఎలా ప్రకటిస్తారని ప్రతివాది సెన్సార్ బోర్డ్ అడ్వకేట్ ను ప్రశ్నించారు. త్వరలో కౌంటర్ వేస్తామని సెన్సార్ బోర్డు పేర్కొంది. మిగిలిన ప్రతివాదులకు నోటీసులు అందినా ఎందుకు హాజరు కాలేదని, కౌంటర్ ఎందుకు వేయలేదని, కోర్టు, సెన్సార్ వారి అనుమతి లేకుండా సినిమా రిలీజ్ చేస్తే కోర్టు వారు చట్ట ప్రకారం ఏం చేయాలో అదే చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈనెల 27వ తేదీకి కన్నప్ప కేసును వాయిదా వేశారు. అదే రోజున ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప సినిమా రిలీజ్ కానున్నట్టు ప్రకటించడం గమనార్హం.