మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’. కేజీయఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్పై ఇటు నందమూరి అభిమానులతో పాటు సినిమా ఆడియెన్స్ లోను భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన డ్రాగన్ గ్లిమ్స్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డ్రాగన్ తదుపరి షెడ్యూల్ కోసం శ్రీలంక దేశానికి పయనం కాబోతుంది యూనిట్. శ్రీలంకలోని అద్భుతమైన లొకేషన్లలో ఎన్టీఆర్పై కొన్ని కీలకమైన, హై-ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను ప్రశాంత్ నీల్ చిత్రీకరించనున్నారని సమాచారం. దీని కోసం చిత్ర యూనిట్ అంతా వచ్చే నెల శ్రీలంకకు వెళ్లనుంది. ఈ భారీ షెడ్యూల్ తో సినిమాకు సంబంధించిన ఒక మేజర్ పార్ట్ పూర్తవుతుందని యూనిట్ నుండి అందుతున్న సమాచారం. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిల్ కపూర్, బిజూ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 11న రిలీజ్ కాబోతున్న డ్రాగన్ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుందని ట్రేడ్ వర్గాలలో వినిపిస్తోంది.

