NTV Telugu Site icon

Tollywood: టాలీవుడ్ కి హీరోయిన్స్ కావలెను!!!

Tollywood

Tollywood

సౌత్ లో హీరోయిన్స్ కొరత ఎక్కువైంది.టాలీవుడ్ లో సత్తా చాటిన బ్యూటీస్ అంతా ఇప్పుడు నార్త్ బాట పట్టారు. కుర్ర కుట్టిస్ సైతం వరుస ప్లాప్స్ తో సైడయిపోయ్యారు. దీంతో ఈ గ్యాప్ ని ఫిల్ చేసే బ్యూటీస్ కోసం సెర్చ్ చేస్తున్నారు మేకర్స్. టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత మళ్లీ మొదలైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన రష్మిక మందన్నా ఇప్పుడు ఇక్కడ సినిమాలు ఒప్పుకోవడం తగ్గించేసి బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. హిందీలో నేషనల్ క్రష్ మూడు సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే నార్త్ సినిమాలకే మృణాల్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. మీనాక్షి చౌదరి సినిమాలు చేస్తున్నా టైర్ 2 హీరోల ప్రాజెక్ట్స్ కే పరిమితమవుతోంది.

Jaya Kishori: వివాదంలో ఆధ్యాత్మిక బోధకురాలు జయ కిషోరి.. నెట్టింట విమర్శలు

ఇక వరుస ప్లాపులతో శ్రీలీల , కృతి శెట్టి ట్రాక్ తప్పారని చెప్పాలి. కేవలం తెలుగులో ఒకటి రెండు సినిమాల్లో నటిస్తున్నారు జాన్వీ, కియారా అద్వానీలు. ఇక ఈ క్రమంలో భాగ్య శ్రీ బోర్సే, మాళవిక, రుక్మిణి వసంత్ వంటి వారి మీద అందరి చూపు పడినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ నిండా మల్లూవుడ్ ముద్దుగుమ్మలే ఉండేవారు. ఇటు గ్లామర్ , అటు పెర్ఫార్మెన్స్ తో వావ్ అనిపించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. సక్సెస్ అందుకున్న కేరళ కుట్టిస్ జాడ ఎక్కడ కనిపించకుండా పోయింది?. ఒక రకంగా టాలీవుడ్ లో కేరళ కుట్టిస్ సడన్ గా జోరు తగ్గించారు. రౌడీ బాయ్స్,టిల్లు స్క్వేర్‌ తో హిట్స్ కొట్టిన అనుపమ ఇప్పటివరకు మరో పెద్ద సినిమాకి సైన్ చేయలేదు. అయితే ఇక్కడ సినిమాలు చేయని ఆమె తమిళ్, మలయాళంలో మతం 5 సినిమాలు చేస్తున్నారు. అలాగే కేవలం మూడే మూడు సినిమాలతో అడ్రస్ గల్లంతు చేసుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. ప్రియా ప్రకాష్ ని పెద్దగా పట్టించుకోలేదు మన తెలుగు మేకర్స్. అలాగే వీర సింహారెడ్డి తో సాలిడ్ హిట్ కొట్టిన హనీ రోజ్ ఇప్పటివరకు మరో సినిమాకి సైన్ చేయలేదు.