Devi sri prasad : గచ్చిబౌలిలో రచ్చలేపనున్న దేవిశ్రీ..
- గచ్చిబౌలిలో దేవి శ్రీ మ్యూజిక్ లైవ్ షో
- ఈ ఏడాది అక్టోబర్ 19న లైవ్ షో
- తొలిసారి ఇండియా టూర్ నిర్వహించనున్న దేవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్. ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీపరిశ్రమలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఇప్పుడంటే తమన్ పోటీ వచ్చి కొంచం స్లో అయ్యాడు కానీ ఒకానొక టైమ్ లో స్టార్ హీరోల ప్రతిసినిమాకు దేవిశ్రీప్రసాద్ పేరు ఉండాల్సింది. అంతగా తన హావ నడిచింది. దేవి శ్రీ సరైన ఆల్బమ్ ఇస్తే అది ఎంతటి సెన్సేషన్ అవుతుందో పుష్ప సినిమానే ఒక ఉదాహరణ.
దేవి సినిమాలకు సంగీతంతో పాటు మ్యూజిక్ లైవ్ షోలు కూడా చేస్తుంటాడు. ఈ మధ్య కాలంలో అనిరుధ్, విజయ్ ఆంటోనీ, ఏఆర్ రెహమాన్ వంటి సంగీత దర్శకులు తరచు లైవ్ షో లు నిర్వహిస్తున్నారు. అదే కోవలో దేవి శ్రీ కూడా లైవ్ షోలు చేస్తున్నాడు కానీ అవి విదేశాల్లో మాత్రమే. ఇప్పటిదాకా ఇండియాలో అది హైదరాబాద్ లో లైవ్ షో చేయలేదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఈ విషయమై దేవిని ప్రశ్నిస్తే అదిగో ఇదిగో అంటూ సమాధానం ఇచ్చాడు తప్ప లైవ్ షో చేయలేదు. ఇన్నాళ్లకు ఆ ముహూర్తం వచ్చింది. దీంతో దేవి శ్రీ ప్రసాద్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.
Also Read
దేవిశ్రీప్రసాద్ ఈ ఏడాది అక్టోబర్ 19న శనివారం రోజు హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో తొలిసారి మ్యూజిక్ లైవ్ షో చేయబోతున్నాడు. తెలుగు ACTC ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన టిక్కెట్ల ధరలను కూడా నిర్ణయించారు. స్టార్టింగ్ ధర రూ.999 నుండి రూ. 1499, రూ. 1999, రూ. 2999గా ఫిక్స్ చేసి పేటిఎమ్, ACTC వెబ్ సైట్లలో సేల్ కి ఉంచారు. హైదరాబాద్ లో గతంలో ఇళయరాజా మూడుసార్లు, ఏఆర్ రెహమాన్ ఒకసారి లైవ్ షో ఇచ్చారు.కాగా ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ పుష్ప ది రూల్, కంగువ, తండేల్ చిత్రాలకు సంగీతం అందిస్తూ ఈ లై షో చేస్తున్నాడు.
Also Read: Kiran Abbavaram: ‘క’ ట్రైలర్ వచ్చేసింది.. కిరణ్ ది మాములుగా లేదుగా ..?
తాజావార్తలు
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?