NTV Telugu Site icon

NTR: అభిమాని చనిపోయిన 11 ఏళ్లయినా.. కుటుంబానికి అండగా తారక్

Jr Ntr

Jr Ntr

సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో ఒకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు పాన్ ఇండియాలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన సినిమాలు విడుదలకు ముందే ట్రెండ్ అవుతాయి. అయితే ఆయన ఎంత మంచి నటుడో.. అంతే మంచి వ్యక్తిత్వం గల మనిషి కూడా. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ తో జూనియర్ ఎన్టీఆర్ నటనా ప్రతిభ ఆస్కార్‌కు చేరుకుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మరో నెలలో రిలీజ్ కానుంది. ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలోకి రానుంది.

READ MORE: Asaduddin Owaisi: సీఎం గారూ, మేం ఎవరి సొమ్ము తినడం లేదు.. ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..

కాగా.. జూనియర్ ఎన్టీఆర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. 2013లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘బాద్ షా’ మ్యూజిక్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. జనం గుంపులో ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో ఓ రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజు అనే అభిమాని మృతి చెందాడు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. తారక్ బాధిత కుటుంబాన్ని కలిశాడు. కుటుంబానికి అండగా ఉంటానని మాట ఇచ్చాడు. 11 ఏళ్లుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. నేటికి కూడా ఆయన తన అభిమాని కుటుంబ బాధ్యతను తానే భుజాన వేసుకున్నాడు. కాగా.. నిర్మాత బండ్ల గణేశ్ అభిమాని కుటుంబానికి రూ. 5 లక్షలు అందజేసిన విషయం తెలిసిందే.