మలయాళ సూపర్స్టార్గా గుర్తింపు పొందిన దుల్కర్ సల్మాన్.. ప్రజంట్ తెలుగులోనూ మంచి ఫ్యాన్బేస్ను సంపాదించుకుంటున్నారు. ‘మహానటి’ తో మొదలు.. ‘సీత రామం’ తో మరో హిట్ అందుకొని, ‘లక్కీ భాస్కర్’ తో ఊహించని విజయం సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాల ద్వారా ఆయనకు తెలుగు ప్రేక్షకుల్లో విశేష క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కాంత’. ఈ సినిమాను రానాకు చెందిన స్పిరిట్ మీడియా భారీ బడ్జెట్తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోండగా.. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుంది. సముద్రఖని, రవీంద్ర విజయ్ వంటి ప్రముఖ నటులు కూడా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1950ల నాటి కాలక్రమాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న ఈ చిత్రం పీరియడ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు దుల్కర్ సల్మాన్. ఆయనతో పాటుగా సినీ నిర్మాత స్వప్న దత్, తదితరులు కూడా ఉన్నారు.