Site icon NTV Telugu

Rajamouli : ఆ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాజమౌళి..?

Whatsapp Image 2024 05 02 At 1.55.05 Pm

Whatsapp Image 2024 05 02 At 1.55.05 Pm

దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.ప్రస్తుతం రాజమౌళి తరువాత సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్‌ మహేష్ బాబుతో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే .ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో మేకర్స్ బిజీ గా వున్నారు.మహేష్ బాబు 29 వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రొడ్యూసర్ కె.ఎల్‌.నారాయణ గతంలో ‘హలో బ్రదర్‌’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ మరియు ‘సంతోషం’ వంటి సూపర్ హిట్‌ చిత్రాలను నిర్మించారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రాజమౌళి,మహేష్ కాంబినేషన్ లో వస్తున్నమూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియాజేశారు.

సుదీర్ఘ విరామం తరువాత ఎస్‌ఎస్‌ఎంబీ 29’ని ప్రొడ్యూస్‌ చేస్తున్నాను.అయితే తాను ఉద్దేశపూర్వకంగా విరామం తీసుకోలేదని ఆయన ప్రకటించారు.రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో సినిమాను 15 ఏళ్ల క్రితమే ఫిక్స్‌ చేసామని ఆయన తెలిపారు.కానీ వారిద్దరికీ వున్నబిజీ షెడ్యూల్స్ వల్ల అప్పుడు కుదరలేదు. అయితే ఇప్పుడు వాళ్లిద్దరి క్రేజ్‌ భారీగా పెరిగింది అని ఆయన తెలిపారు. అయినా కూడా దర్శకుడు రాజమౌళి ఇచ్చిన మాటకు కట్టుబడి నాతో సినిమా చేస్తున్నారు. నేను చెప్పకపోయినా ‘దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్‌’లో మూవీ తీస్తున్నట్లుగా వాళ్లే ప్రకటించారు. అందుకు వాళ్లకి కృతజ్ఞుడిని. రాజమౌళికి హాలీవుడ్‌ నుంచీ ఎన్నో భారీ ఆఫర్లు వచ్చాయి.అయినా కూడా వాటిని కాదనుకుని నా కోసం సినిమా చేస్తున్నారు. రెండు నెలల నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ సాగుతుందని ఆయన తెలిపారు.

Exit mobile version