Dharma Mahesh : 1000 మంది అభిమానులతో కొత్త రెస్టారెంట్ ఓపెనింగ్
టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్ తన ఫుడ్ వెంచర్లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. డిసెంబర్ 11, 2025న గుంటూరులో ‘జిస్మత్ జైల్ మండి’ మూడో బ్రాంచ్ను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకకు వెయ్యి మందికి పైగా అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి తరలివచ్చారు. వేదిక వద్దకు చేరుకున్న ధర్మ మహేష్కు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. మహేష్ తల్లి అరుణ, తండ్రి కాకాని వెంకటేశ్వర రావు, సోదరి కాకాని భాగ్య లక్ష్మి, జిస్మత్ లీగల్ అడ్వైజర్ మరియు హైకోర్టు అడ్వకేట్ నాగూర్బాబు ఎన్. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ధర్మ మహేష్ 2017లో గుంటూరులో ‘గిస్మత్ అరబిక్ మండి’ స్థాపనతో తన ఫుడ్ వెంచర్ ప్రారంభించారు. తన ప్రత్యేకమైన ‘జైల్ మండి’ మరియు ‘అరబిక్ మండి’ కాన్సెప్ట్లతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఈ బ్రాండ్ ప్రాచుర్యం పొందింది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ బ్రాండ్ 17కు పైగా బ్రాంచ్లకు విస్తరించి, ప్రామాణికమైన రుచులు, విలక్షణమైన డైనింగ్ అనుభవంతో బలమైన ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో మహేష్ తన యాజమాన్య వ్యాపారాన్ని గిస్మత్ రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్గా మార్చారు. కంపెనీ పేరును ‘గిస్మత్’ నుంచి ‘జిస్మత్’గా మార్చారు. తన కుమారుడు ఝగద్వజ పేరులోని మొదటి అక్షరం ‘J’ వచ్చేలా పేరు మార్పు చేయడం జరిగింది.
Also Read
తాజావార్తలు
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
-
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
-
Rakasa : ‘రాకాస’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!