చిరుతో సుజీత్ తమిళ రీమేక్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“సాహో” చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్. అయితే ఈ చిత్రం ఫ్లాప్ కావడంతో ఇక సుజీత్ కెరీర్ ముగిసినట్లేనని అంతా అనుకున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి సినిమా అవకాశం పట్టేశాడు. మలయాళ హిట్ ‘లూసిఫర్’ రీమేక్ కు దర్శకత్వం వహించడానికి సుజీత్ ను మొదటగా ఎంపిక చేసుకున్నారు. అయితే కొన్ని కారణాలతో సుజీత్ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చాడు. కానీ మెగాస్టార్ కోసం సుజీత్ మరో తమిళ రీమేక్ ను సిద్ధం చేస్తున్నాడనేది తాజా సమాచారం. లాక్డౌన్ సమయంలో చిరంజీవి ఇతర భాషల నుండి కొన్ని చిత్రాలను ఎంపిక చేసుకున్నారట. అందులో కొన్నిటిని రీమేక్ చేయడానికి ఆసక్తిని కనబరిచారట. అజిత్ నటించిన “యెన్నై అరింధాల్” చిత్రం అందులో ఒకటి. తమిళంలో గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా… అజిత్, త్రిష, అనుష్క ప్రధాన పాత్రలు పోషించారు. ‘ఎంతవాడు గాని’ టైటిల్ తో ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేశారట మేకర్స్. సుజీత్ కు ఈ స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పని అప్పజెప్పారట మెగాస్టార్. త్వరలోనే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్పులతో మొదటి వెర్షన్ను వివరించే పనిలో పడ్డాడట సుజీత్.
Also Read
- AshuReddy Case : అషురెడ్డి కేసులో స్టేకు హైకోర్టు నిరాకరణ.. రంగంలోకి పోలీసులు
- Laila: జ్యోతికకు తెలిస్తే చంపేస్తుంది.. సూర్య పై ఓపెన్ కామెంట్స్ చేసిన లైలా
- PEDDI North America Bookings : పెద్ది ఓవర్సీస్.. నార్త్ అమెరికా బుకింగ్స్ ఓపెన్.. 30 నిమిషాల్లో ఊచకోత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా..హాలీవుడ్ ‘రీసెట్’ మూవీ క్రేజీ అప్డేట్!
- Tags
- Sujeeth
- Tamil Ramake
తాజావార్తలు
-
Trump Tariffs: అమెరికా కోర్టు నుంచి ట్రంప్కు మరో ఎదురుదెబ్బ.. 10% సుంకాలు చట్టవిరుద్ధమని కొట్టివేత
-
BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్!
-
AshuReddy Case : అషురెడ్డి కేసులో స్టేకు హైకోర్టు నిరాకరణ.. రంగంలోకి పోలీసులు
-
Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
-
Laila: జ్యోతికకు తెలిస్తే చంపేస్తుంది.. సూర్య పై ఓపెన్ కామెంట్స్ చేసిన లైలా