Bhagyashri Borse: పాప గట్టి ప్లాన్ తోనే టాలీవుడ్లో దిగినట్టుందే!
- రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్
- మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీ
- భవిష్యత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagyashri Borse Intrested to be a Director and Producer too: మరాఠీ భామ భాగ్యశ్రీ బోర్సే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆమె నటించిన మొదటి సినిమా కూడా ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు కానీ సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా ఆమె దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ బాగా దగ్గరైపోయింది. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో జిక్కి అనే పాత్రలో నటించింది భాగ్యశ్రీ. ఈమెతో కలిసి రవితేజ చేసిన డాన్స్ స్టెప్పులు సైతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యేలా ప్రమోషన్స్ చేసింది సినిమా యూనిట్. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పోస్టర్ల మీద కూడా ఆమెకు సింహభాగం దక్కిందని చెప్పాలి.
Manchu Vishnu : కూతురు పుట్టినరోజు.. నటీనటులకు మంచు విష్ణు 10 లక్షల విరాళం
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
అలాంటి భామ తాజాగా మీడియాతో వరుస ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇస్తోంది. అందులో భాగంగానే నిన్న ప్రింట్ అండ్ వెబ్ మీడియాతో ఆమె ముచ్చటించింది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆఫ్ ది రికార్డుగా కొన్ని విషయాలు పంచుకుంది. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పారు కదా భవిష్యత్తులో పాట పాడే అవకాశం ఉందా అని అడిగితే కచ్చితంగా పాడతానని తనకు పాడటం అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తాను ఇదే ఇండస్ట్రీలో ఉంటానని భవిష్యత్తులో డైరెక్షన్ చేస్తానని నిర్మాతగా కూడా మారతానని అంటూ ఆమె కామెంట్ చేయడం గమనార్హం. ఈ లెక్కన చూసుకుంటే ఆమె అంత ఆషామాషీగా ఏమీ టాలీవుడ్ లోకి రాలేదు ఏదో గట్టి ప్లాన్ తోనే వచ్చింది. ఇక్కడ సెటిలైపోవాలని దర్శకత్వం నిర్మాణాల సైతం చేయాలని ఫిక్స్ అయింది అనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో?
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!