దర్శక ధీరుడు జేమ్స్ కేమెరూన్ సృష్టించిన ఈ అద్భుత దృశ్య కావ్యం, గత ఏడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. గత రెండు భాగాలతో పోలిస్తే కొంత తక్కువగా అనిపించినా, బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ వారు జూన్ 24 నుండి అందుబాటులోకి తెస్తున్నట్లు ఖరారు చేశారు. నిజానికి, ఈ సినిమా ఇప్పటికే డిజిటల్ ప్లాట్ఫామ్లలో రెంటల్ (అద్దె) ప్రాతిపదికన అందుబాటులో ఉంది. అయితే జూన్ 24 నుండి సబ్స్క్రిప్షన్ ఉన్న వినియోగదారులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే (Free OTT) ఈ సినిమాను వీక్షించవచ్చు.
ఇండియాలో ఈ చిత్రం అదే తేదీన జియో హాట్స్టార్ (Jio Hotstar) లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. తెలుగు, హిందీ, తమిళం వంటి పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇండియన్ స్ట్రీమింగ్పై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అద్భుతమైన విజువల్స్ మరియు పండోరా ప్రపంచాన్ని మరోసారి ఇంట్లోనే కూర్చుని ఆస్వాదించేందుకు సిద్ధమవ్వండి.
