ఆర్యన్ఖాన్ కేసులో ట్విస్ట్…దర్యాప్తు అధికారి తొలిగింపు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి ఆరోపణల కారణంగా.. ఈ కేసు దర్యాప్తు నుంచి ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేను తప్పిస్తూ ఎన్సీబీ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో విచారణాధికారిగా సంజయ్ సింగ్ను నియమించారు. వాంఖడేను ఢిల్లీలో ఎన్సీబీ కేంద్ర కార్యాలయానికి బదిలీ చేశారు. ఇకపై ఆర్యన్ఖాన్ కేసు సహా మొత్తం ఆరు డ్రగ్ కేసులను సంజయ్ సింగ్ నేతృత్వంలో ఎన్సీబీ సెంట్రల్ యూనిట్ దర్యాప్తు చేయనుంది.సమీర్ వాంఖడే చుట్టూ ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి.
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ పట్టుబడ్డ తర్వాత.. కేసు నుంచి అతన్ని తప్పించేందుకు 25 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు వాంఖడే ఆరోపణలు ఉన్నాయ్. అటు డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వాంఖడేను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్. వాంఖడే కోట్లకు పడగలెత్తారని.. ఆయన నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగం సంపాదించాడని ఆరోపించారు. వెంటనే రంగంలోకి దిగిన సెంట్రల్ ఎన్సీబీ.. వాంఖడేతో పాటు మరికొంత మందిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుండగానే ఆయన్ని తప్పించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆర్యన్ ఖాన్తో సహా ఆరు డ్రగ్స్ కేసులను విచారించేందుకు.. ఇవాళ ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లనుంది ఎన్సీబీ ప్రత్యేక బృందం.
Also Read
- Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
- Nagarjuna: నాగార్జునకు బర్త్డే విషెస్ చెప్పబోయి అడ్డంగా బుక్కైన ప్రగ్యా జైస్వాల్
- Irumudi OTT : ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
- Ravi Teja: ఇరుముడి జోష్లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?
తాజావార్తలు
-
Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్లో కనిపిస్తున్న మృతదేహాలు..
-
Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
-
CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ
-
Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
-
China: గాల్వాన్ జనరల్పై జిన్పింగ్ వేటు.. భారత్కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్కు షాక్
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!