Nandi Awards: నంది అవార్డుల పేరు మార్పు.. సినిమాటోగ్రఫీ మంత్రి కీలక ప్రకటన
- మంత్రి కందుల దుర్గేష్తో నిర్మాతల భేటీ
- ఈ సంవత్సరంలోనే నంది అవార్డ్స్ ప్రకటన
- పేరు మార్పు ఆలోచన లేదని స్పష్టీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సోమవారం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలతో ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. రాష్ట్రంలో సినిమా షూటింగ్ స్పాట్స్, స్టూడియో నిర్మాణం, రీ-రికార్డింగ్ స్టూడియోల అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్, మరియు నంది అవార్డ్స్ వంటి ముఖ్యమైన అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. స్టూడియో నిర్మాణాలు జరిగితే రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. “సినిమా రంగంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా యువతకు సినీ పరిశ్రమలో మరిన్ని అవకాశాలు కల్పించవచ్చు. దీనితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుంది,” అని మంత్రి పేర్కొన్నారు.
Also Read : Tollywood : డివోషనల్ టచ్ తో వస్తున్న ఇద్దరు యంగ్ హీరోలు.. హిట్ దక్కుతుందా.?
Also Read
- Malayalam sequels : మలయాళ ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న సీక్వెల్స్.. వందల కోట్ల వసూళ్లతో రికార్డ్స్
- KING : షారూఖ్ ఖాన్ కింగ్ను వదలని లీక్స్.. నెట్టింట వైరల్ అవుతున్న రొమాంటిక్ సీన్
- SPIRIT : ప్రభాస్తో పెట్టుకుంటే ఇంతే సంగతులా? 'స్పిరిట్'పై మాకు నమ్మకం లేదు?
- Jana Nayagan: 'జననాయగన్' టైటిల్ కార్డ్తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై 'తమిళనాడు సీఎం'
ఈ సమావేశంలో నంది అవార్డ్స్పై కూడా ప్రత్యేక చర్చ జరిగింది. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, “ఈ సంవత్సరంలోనే నంది అవార్డ్స్ను ప్రకటిస్తాము. దీనికి సంబంధించి రెండు, మూడు ప్రతిపాదనలపై అలోచిస్తున్నాము. అయితే, నంది అవార్డ్స్ పేరును మార్చే ఆలోచన ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే నంది అవార్డ్స్ అనే పేరు ఎన్నో సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఒక గుర్తింపుగా నిలిచింది,” అని స్పష్టం చేశారు. ఈ భేటీలో నిర్మాతలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో మరో సమావేశం ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిసింది. రాష్ట్రంలో సినీ పరిశ్రమకు స్నేహపూరిత వాతావరణం ఉండాలని, అందరూ కలిసి పని, చేస్తే ఆంధ్రప్రదేశ్ సినీ హబ్గా మరింత బలపడుతుందని నిర్మాతలు ఆకాంక్షించారు. ఈ సమావేశంలో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, డి.వి.వి. దానయ్య, కె.ఎల్. నారాయణ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్, నాగ వంశీ, యెర్నేని రవిశంకర్, విశ్వ ప్రసాద్, బన్నీ వాసు, యూవీ క్రియేషన్స్ వంశీ, మైత్రీ మూవీ మేకర్స్ చెర్రీ, వివేక్ కూచిభొట్ల, సాహు గారపాటి వంటి ప్రముఖ నిర్మాతలు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Suryavanshi: అది బుడ్డోడి రేంజ్.. వైభవ్ సూర్యవంశీ కోసం వేలం వ్యూహాన్ని మార్చుకున్న రాజస్థాన్..!
-
Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్లోకి కూడా చేరిన అభిషేక్.
-
Malayalam sequels : మలయాళ ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న సీక్వెల్స్.. వందల కోట్ల వసూళ్లతో రికార్డ్స్
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!