Nandi Awards: నంది అవార్డుల పేరు మార్పు.. సినిమాటోగ్రఫీ మంత్రి కీలక ప్రకటన
- మంత్రి కందుల దుర్గేష్తో నిర్మాతల భేటీ
- ఈ సంవత్సరంలోనే నంది అవార్డ్స్ ప్రకటన
- పేరు మార్పు ఆలోచన లేదని స్పష్టీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సోమవారం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలతో ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. రాష్ట్రంలో సినిమా షూటింగ్ స్పాట్స్, స్టూడియో నిర్మాణం, రీ-రికార్డింగ్ స్టూడియోల అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్, మరియు నంది అవార్డ్స్ వంటి ముఖ్యమైన అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. స్టూడియో నిర్మాణాలు జరిగితే రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. “సినిమా రంగంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా యువతకు సినీ పరిశ్రమలో మరిన్ని అవకాశాలు కల్పించవచ్చు. దీనితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుంది,” అని మంత్రి పేర్కొన్నారు.
Also Read : Tollywood : డివోషనల్ టచ్ తో వస్తున్న ఇద్దరు యంగ్ హీరోలు.. హిట్ దక్కుతుందా.?
Also Read
- Rishab Shetty: రామాయణ ట్రైలర్కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
- LuckyBaskhar 2: దుల్కర్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘లక్కీ భాస్కర్ 2’ పక్కా, కానీ ఓ ట్విస్ట్ ఉంది!
- SIIMA 2026 Nominations: సైమా 2026 నామినేషన్స్ వచ్చేశాయ్.. తెలుగు నుంచి ఈ సినిమాదే హవా!
- Kajal Aggarwal: "అతను నా పర్మిషన్ లేకుండానే కారవాన్లోకి వచ్చాడు".. తర్వాత ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
ఈ సమావేశంలో నంది అవార్డ్స్పై కూడా ప్రత్యేక చర్చ జరిగింది. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, “ఈ సంవత్సరంలోనే నంది అవార్డ్స్ను ప్రకటిస్తాము. దీనికి సంబంధించి రెండు, మూడు ప్రతిపాదనలపై అలోచిస్తున్నాము. అయితే, నంది అవార్డ్స్ పేరును మార్చే ఆలోచన ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే నంది అవార్డ్స్ అనే పేరు ఎన్నో సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఒక గుర్తింపుగా నిలిచింది,” అని స్పష్టం చేశారు. ఈ భేటీలో నిర్మాతలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో మరో సమావేశం ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిసింది. రాష్ట్రంలో సినీ పరిశ్రమకు స్నేహపూరిత వాతావరణం ఉండాలని, అందరూ కలిసి పని, చేస్తే ఆంధ్రప్రదేశ్ సినీ హబ్గా మరింత బలపడుతుందని నిర్మాతలు ఆకాంక్షించారు. ఈ సమావేశంలో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, డి.వి.వి. దానయ్య, కె.ఎల్. నారాయణ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్, నాగ వంశీ, యెర్నేని రవిశంకర్, విశ్వ ప్రసాద్, బన్నీ వాసు, యూవీ క్రియేషన్స్ వంశీ, మైత్రీ మూవీ మేకర్స్ చెర్రీ, వివేక్ కూచిభొట్ల, సాహు గారపాటి వంటి ప్రముఖ నిర్మాతలు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!