అనుపమ పరమేశ్వరన్, విక్రమ్ కొడుకు ధ్రువ్ రెండు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ కలిసి ‘బైసన్’ మూవీ చేశారు. రెండేళ్ల లవ్ స్టోరీకి బ్రేక్ పడింది. ఇన్స్టాలో ధ్రువ్ను అనుపమ అన్ఫాలో కావడంతో బ్రేకప్ వార్త బయటికొచ్చింది. విడిపోయారు అంటూ వస్తున్న వార్తలను ఈ ఇద్దరు లవర్స్ ఖండించలేదు. దీనికి తోడు అనుపమ ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ బ్రేకప్ను బలపరిచింది. “ఇకపై ఎవరి అనుమతులూ అవసరం లేదు. నా జీవితం, నా వాయిస్ను నేనే ఎంచుకుంటున్నాను. భయం లేదు, ఎట్టకేలకు మనశ్శాంతి నన్ను వెతుక్కుంటూ వచ్చింది” అన్న భావంతో అనుపమ పెట్టిన పోస్ట్తో ఈ ఇద్దరూ విడిపోయారని నెటిజన్లు డిసైడ్ చేశారు. లేటెస్ట్ పోస్ట్తో పాటు షేర్ చేసిన వీడియోలో సోలోగా విహరించింది అనుపమ. ఫ్రీడమ్ వచ్చిందని సింబాలిక్గా ఈ వీడియో పెట్టిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
అనుపమ పరమేశ్వరన్ పోస్ట్ పై తీవ్ర చర్చ కూడా నడుస్తోంది. అనుపమ ఏం చేయాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చిందా? ఇంతకాలం స్వేచ్ఛ లేకుండా భయపడుతూ బతికిందా? అన్న డిస్కషన్కు అనుపమ పోస్ట్ తెరలేపింది. చాలా మంది సెలబ్రిటీస్ ప్రేమించుకొని విడిపోయినా గౌరవంగా బ్రేకప్ చెప్పేశారు. కానీ అనుపమ – ధ్రువ్ లవ్ స్టోరీ గొడవలతో ముగిసిందన్న వార్త వైరల్ అవుతోంది. చెన్నై స్టార్ హోటల్లో ఈ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని తెలిసింది. అనుపమ కోపం ఆపుకోలేక ధ్రువ్ను చెప్పుతో కొట్టి ‘గుడ్ బై’ చెప్పిందంటూ ప్రచారం సాగుతోంది. ఇది నిజమో కాదో గానీ, అనుపమ వెళ్ళిపోతూ ధ్రువ్ను శాపనార్థాలు పెట్టిందన్న వార్త వైరల్ అవుతోంది.

