రాజ్ కుంద్రా కేసులో వెలుగులోకి మరో ట్విస్ట్… !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అశ్లీల చిత్రాలు నిర్మాణం, యాప్ ల ద్వారా షేర్ చేయడం వంటి ఆరోపణలతో వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న రాజ్ కుంద్రా పోలీస్ కస్టడీ జూలై 27న ముగియనుంది. అశ్లీల చిత్రాల కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న రాజ్ కుంద్రా కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో పలు కోణాల్లో విచారిస్తున్న పోలీసుల ద్వారా రోజుకో కొత్త కేసు వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే కాన్పూర్ లోని రాజ్ కుంద్రాకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను స్వాధీనం చేసుకోవాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ముంబై క్రైమ్ బ్రాంచ్ రిక్వెస్ట్ చేసింది. ఈ రెండు బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు జమ కావడంతో ఆదివారం ఎస్బిఐ అధికారులు రాజ్ ఖాతాలను సీజ్ చేశారు. అనంతరం మరో కేసు వెలుగులోకి వచ్చి ట్విస్ట్ ఇచ్చింది.
Read Also : ఎన్టీఆర్ రిలీజ్ చేసిన “తిమ్మరుసు” ట్రైలర్
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
- Nayyi Navelli: దసరాకు యామీ గౌతమ్ 'నయ్యి నవెల్లి'
రాజ్ కుంద్రాకు చెందిన నిర్మాణ సంస్థను అరవింద్ శ్రీవాస్తవ అనే వ్యక్తి నడుపుతున్నట్లుగా పోలీసులు కనుగొన్నారు. ఆ డబ్బును అరవింద్ శ్రీవాత్సవ భార్య హర్షిత ఖాతాలోకి బదిలీ చేస్తున్నారు. ఈ విషయంపై అరవింద్ తండ్రి ఎస్.పి శ్రీవాత్సవ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు గత రెండేళ్ల నుంచి ఇంటికి రావట్లేదని, కానీ ఖర్చుల కోసం మాత్రం డబ్బులు పంపుతూ ఉంటాడు అని, 2021 ఫిబ్రవరిలో అరవింద్ కోసం ముంబై క్రైమ్ బ్రాంచ్ లుకౌట్ నోటీసులు జారీ చేసిందని ఆయన వెల్లడించారు. హర్షిత అకౌంట్లో డబ్బు జమ అవుతున్న విషయం గురించి తనకసలు తెలియదని చెప్పుకొచ్చారు. ఇక ఈ రోజు మరోసారి పోలీసులు రాజ్ ను కోర్టుకు తీసుకెళ్లనున్నారు. ఆయన బెయిల్ విచారణ కూడా జరుగుతుంది. పోలీసులు సమర్పించే ఆధారాలను బట్టి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో? రాజ్ కు బెయిల్ లభిస్తుందా? అనేది వేచి చూడాలి.
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
-
India vs Pakistan: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!