NTV Telugu Site icon

UAE : UAE ప్రతిష్టాత్మక గోల్డెన్ వీసా అందుకున్న మరొక తెలుగు హీరో..ఎవరా హీరో..?

Untitled Design (19)

Untitled Design (19)

వివిధ రంగాలలో సేవలందించినందుకు గాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కొందరు ప్రముఖులకు, సినీ రంగంలోని తారలకు గోల్డెన్ వీసాలు అందజేస్తున్న విషయం విదితమే. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు ఈ వీసా అందుకున్నారు.

తాజాగా మరోక టాలీవుడ్ హీరో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసా అందుకున్నారు. అతనెవరో కాదు ప్రస్తుతం మా అధ్యక్షులు మంచు విష్ణు. ఆర్ట్స్ మరియు కల్చర్ కు  ఆయన చేసిన విశేష సేవలను గుర్తిస్తూ అబుదాబిలోని సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ ప్రతిష్టాత్మక UAE గోల్డెన్ వీసాను మంచు విష్ణుకు మంజూరు చేసింది. ఈ మేరకు ఆ వీసాను మంచు విష్ణుకు అందజేశారు సదరు అధికారులు. UAE గోల్డెన్ వీసా అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసాడు విష్ణు.

ఈ వీసాతో దుబాయ్ లో పదేళ్ల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా నివాసముండొచ్చు. 2019 నుంచి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి దుబాయ్ ప్రభుత్వం ఇలా గోల్డెన్ వీసాతో సత్కరిస్తుంది. కాగా మంచు విష్ణు కంటే ముందుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల ఈ గోల్డెన్ వీసా అందుకున్నారు. వీరితో పాటు అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ విశిష్ట గౌరవం దక్కించుకున్నారు. అటు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ గోల్డెన్ వీసా పొందారు. ఇప్పుడు మంచు గోల్డెన్ వీసా సెలెబ్రిటీల జాబితాలో చేరారు. మంచు విష్ణు తన  డ్రీమ్ ప్రాజెక్ట్ అయునటువంటి ‘కన్నప్ప’లో నటిస్తూ నిర్మిస్తున్నాడు. డిసెంబరులో కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Also Read: Sradda srinadh: శ్రద్ధాకు శ్రద్ధగా స్వాగతం పలికిన యూనిట్ ..ఇంతకీ ఏ సినిమా..?