దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ఎంతో మంది సినీ తారలు, క్రీడా ప్రముఖులు కరోనా టీకా తీసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని బిగ్బీ ఇన్స్టా ద్వారా తెలిపారు. ‘రెండో డోస్ కూడా తీసుకున్నాను’ అని రాసుకొచ్చారు. ఇక ఆ మధ్య అమితాబ్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఇక అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘మేడే’, ‘గుడ్బై’ సహా పలు చిత్రాల్లో బిగ్బీ నటిస్తున్నారు.