NTV Telugu Site icon

Tollywood : నైజాంలో దూసుకెళ్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ.

సినిమాల విడుదల విషయంలో ఆంధ్ర విషయంలో ఒక పద్ధతి, తెలంగాన వ్యాప్తంగా మరో పద్ధతిలో చేస్తుంటరు నిర్మాతలు. బడా నిర్మాణ సంస్థలకు ఆంధ్రలో రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. ఆయా సంస్థల నుండి వచ్చే సినిమాలు ఏరియాల వారి వీళ్ళే రిలీజ్ చేస్తుంటారు. కానీ తెలంగాణ వ్యవహారం అలా ఉండదు. దిల్ రాజు, ఏషియన్ సునీల్, సురేష్ మూవీస్, గీత ఆర్ట్స్. దాదాపు ఈ నాలుగు సంస్థల ముందుంటాయి రెగ్యులర్ దిల్ రాజు మాత్రమే లైన్ లో ఉంటారు. మధ్యలో వచ్చిన వరంగల్ శీను తదితరులు ఇలా వచ్చి ఆలా వెళ్లారు .

కాగా నైజాంలో ఇప్పుడు పరిస్థితులు మారినట్టే కనిపిస్తోంది చూస్తుంటే. టాలీవుడ్ లోని ప్రముఖనిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నైజాంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫిస్ మొదలుపెట్టి సినిమాలు కొనడం ప్రారంభించారు. ఈ మధ్య కాలంలో చిన్న చితక సినిమాలు దగ్గరనుండి పాన్ ఇండియా సినిమాలు, ఇతర భాషల సినిమాలు, డబ్బింగ్ సినిమాలు ఏదైనా సరే మైత్రీ మూవీస్ స్టాంప్ ఉండాల్సిందే. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది మైత్రీ మూవీస్.

కాగా రానున్న ఆగస్టు 15న విడుదలయ్యే బడా సినిమాలు 3 మైత్రీ చేతిలోకి వెళ్లాయి. రవితేజ, పీపుల్స్ మీడియా మిస్టర్ బచ్చన్ నైజాంలో విడుదల చేస్తుంది. అటు రామ్ -పూరిల డబుల్ ఇస్మార్ట్ నిరంజన్ రెడ్డి కొనుగోలు చేయగా ఇది కూడా న=మైత్రీ ద్వారా విడుదల చేసేందుకు మాటలు జరుగుతున్నాయి. ఇక విక్రమ్ తమిళ డబ్బింగ్ సినిమా ‘తంగలాన్’ నైజాం రిలీజ్ బై మైత్రి. ఇలా నైజాంలో ఒకప్పుడు కింగ్ పిన్ అయిన దిల్ రాజునూ వెనక్కు నెట్టి అతి తక్కువ కాలంలో దూసుకెళ్తోంది మైత్రీ మూవీస్.

Also  Read: Tollywood talk: ఫ్లాపుల తర్వాత వస్తోన్న కాంబీనేషన్ కు కిరాక్ డీల్..!