ఈ రోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరూ ఈ ఆనందకరమైన సందర్భాన్ని జరుపుకోవడంలో బిజీగా ఉన్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా ఈ ట్రెండ్ను కొనసాగిస్తూ తమ అభిమానులకు, ప్రియమైన వారికి సోషల్ మీడియాలో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సైతం అభిమానులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఓ స్పెషల్ వీడియో ద్వారా తన తనయుడు రామ్ చరణ్ తో కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చేసిన వెంటనే సినిమా టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణాలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్ కు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇక చిరు హీరోగా ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 4న విడుదల కానుంది. మరోవైపు చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
