Chiranjeevi: చిరంజీవి తదుపరి సినిమాకి ముహూర్తం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi next movie to be launched on August 22nd: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా తమన్నా భాటియా నటించగా మెగాస్టార్ చిరంజీవి సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. అలాగే ఆమె బాయ్ ఫ్రెండ్ గా అక్కినేని హీరో సుశాంత్ నటించిన ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా ముహూర్తం డేట్ అయితే బయటకు వచ్చేసింది. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో అక్కడి నుంచి తిరిగి రానున్న చిరంజీవి భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నారు .
BRO : సినిమాను సరికొత్తగా ప్రమోట్ చేస్తున్న మేకర్స్..
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
భోళాశంకర్ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఇక సినిమా ప్రమోషన్స్ పూర్తయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు అంటే ఆగస్టు 22వ తేదీన ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మేరకు ఆయన కుమార్తె కల్యాణ కృష్ణ సినిమాని నిర్మించబోతున్న సుస్మిత కొణిదెల నిర్ణయం తీసుకున్నారు. సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను ఇప్పటికే స్థాపించి పలు వెబ్ సిరీస్ లు, ఒక సినిమాను నిర్మించింది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిషా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో మరో యంగ్ హీరోకి కూడా అవకాశం ఉంది. అయితే సిద్దు జొన్నలగడ్డని ముందు నుంచి కన్సిడర్ చేయగా ఆయన తనకు డేట్స్ కుదరవని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపద్యంలో శర్వానంద్ లేదా వరుణ్ తేజ్ లో ఒకరిని ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!