Site icon NTV Telugu

Chiranjeevi : మరోమారు సేవాగుణం చాటిన మెగాస్టార్ .. ఎన్టీఆర్ అవార్డు డబ్బు దానం !

Chiru

Chiru

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. తన కుమారుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని, సమాజానికి మేలు చేసే ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ‘మన శంకర వరా ప్రసాద్ గారు’ వంటి భారీ విజయం తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, సేవా కార్యక్రమాలకు ఆయన ప్రాధాన్యతనివ్వడం విశేషం, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చిరంజీవిని ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ అవార్డుతో గౌరవించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుతో పాటు అందిన 10 లక్షల రూపాయల నగదు బహుమతిని ఆయన తన సొంతానికి వాడుకోకుండా, ఐదు వేర్వేరు సేవా సంస్థలకు విరాళంగా అందజేశారు. తన సుదీర్ఘ సామాజిక సేవా ప్రస్థానంలో భాగంగా ఈ మొత్తాన్ని అవసరార్థులకు వెచ్చించి తన పెద్దరికాన్ని చాటుకున్నారు.

Also Read :Dhurandhar 2: దురంధర్ 2 ఊచకోత.. ఇండియాలోనే మొదటి సినిమాగా కొత్త రికార్డ్

ఈ విరాళాల వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌ను కలిసిన వృద్ధాశ్రమ వాసులు, ఆయన పుట్టినరోజును జరుపుకోవాలని ఆకాంక్షించారు. వారి కోరికను మన్నించి, చిరంజీవి సుమారు 30 మంది వృద్ధులను బ్లడ్ బ్యాంక్‌కు ఆహ్వానించారు. వారికి కొత్త బట్టలు పంపిణీ చేయడమే కాకుండా, స్వయంగా విందు భోజనం ఏర్పాటు చేసి చరణ్ పుట్టినరోజును చిరస్మరణీయం చేశారు.
చిరంజీవి అందించిన ఆర్థిక సాయం ఈ క్రింది రంగాల్లో కృషి చేస్తున్న సంస్థలకు అందింది:
సర్వ్ ఫౌండేషన్: వృద్ధుల నిత్యావసరాల కోసం.
దేవ్నార్ ఫౌండేషన్: దృష్టి లోపం ఉన్న వారికి చేయూతనిచ్చేందుకు.
వాల్మీకి & నయశ్రీ ఫౌండేషన్లు: అనాథ పిల్లల సంరక్షణ మరియు వారి భవిష్యత్తు కోసం.
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి: క్యాన్సర్‌తో పోరాడుతున్న ఒక చిన్నారి చికిత్స నిమిత్తం ప్రత్యేక విరాళం.

Exit mobile version