అరవై ఏళ్ళ మధురం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నాటికీ ఎంతోమంది కె.జె.ఏసుదాస్ మధురగానంతోనే నిదుర లేచి ఆనందిస్తూ ఉంటారు. ఆయన మాతృభూమి కేరళలోనే కాదు, యావద్భారతంలోకె.జె.ఏసుదాస్ మధురస్వరం వింటూనే రోజు ప్రారంభించే సంగీతాభిమానులు ఎందరో ఉన్నారు. నవంబర్ 14తో ఏసుదాస్ మధురగానానికి షష్టి పూర్తి. ఆయన తొలిసారి గానం చేసిన పాట రికార్డ్ అయింది. శ్రీనారాయణ గురు రాసిన జాతి భేదం... మత ద్వేషం... అంటూ సాగే ఆ పాటను సంగీత దర్శకులు ఎమ్.బి. శ్రీనివాసన్ , ఏసుదాస్ గళంలో కల్పదుకళ్* చిత్రం కోసం రికార్డ్ చేశారు. ప్రేమ్ నజీర్ హీరోగారూపొందినకల్పదుకళ్చిత్రం 1962 సెప్టెంబర్ 7న జనం ముందు నిలచింది. ఈ పాటతోనే ఏసుదాస్ మధురగానం తొలిసారి వెలుగు చూసింది.అప్పటికే తెలుగు మధురగాయకుడు పి.బి.శ్రీనివాస్ గానం కేరళ వాసులను ఆనందసాగరంలో ముంచెత్తెంది. కొందరు ఏసుదాస్ గానం విని, పి.బి.శ్రీనివాస్ లాగే ఉందన్నారు. ఆ తరువాత ఏసుదాస్ కొన్ని చిత్రాలలో నటిస్తూ కూడా పాటలు పాడారు. ప్రేమ్ నజీర్ నటించిన అనేక చిత్రాలలోని సూపర్ హిట్ సాంగ్స్ ఏసుదాస్ గళం నుండే జాలువారడం విశేషం. ఆ రోజుల్లో దక్షిణాది భాషలన్ని చిత్రరంగాలు మదరాసులోనే ఉండేవి. దాంతో ఒకరి ప్రతిభ మరొకరికి ఇట్టే తెలిసిపోయేది. అలా తెలుగువారిలోనూ ఏసుదాస్ గాత్రంపై చర్చ సాగింది. సంగీత దర్శకులు ఎస్.పి.కోదండ పాణి చెవిన కూడా ఏసుదాస్ ప్రతిభ సోకింది. తాను స్వరపరచినబంగారు తిమ్మరాజు`లో ఆరుద్ర రాసిన ఓ నిండు చందమామ.... సాంగ్ తో తెలుగు సినిమారంగానికి పరిచయంచేశారు. కాంతారావు అభినయంతో సాగిన ఆ పాట ఇప్పటికీ వీనులవిందు చేస్తూనే ఉంది.
అటుపై మళయాళ, తెలుగు, తమిళ, కన్నడ , హిందీ, ఒరియా, మరాఠీ, బెంగాలీ, ఇంగ్లిష్, లాటిన్, రష్యన్ పాటలతోనూ ఏసుదాస్ స్వరవిన్యాసాలు సాగాయి. జాతీయ స్థాయిలో అత్యధిక సార్లు అంటే 8 సార్లు నిలిచిన మధురగాయకునిగానూ ఏసుదాస్ చరిత్ర సృష్టించారు. ఏసుదాస్ పాటకు, తెలుగు చిత్రసీమకు ఎంతో అనుబంధం ఉంది. యన్టీఆర్ తన శ్రీకృష్ణసత్యలో ఆంజనేయ స్వామికిపాడిన శ్రీరామ జయరామ... గీతం ఇప్పటికీ భక్తకోటిని అలరిస్తోంది. ఏయన్నార్ మేఘసందేశం ద్వారా జాతీయ అవార్డూ లభించింది. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోలు సైతం ఏసుదాస్ మధురగానంతో విజయాలను చూశారు. ఇక మోహన్ బాబు తన సొంత చిత్రాలలో తప్పకుండా ఏసుదాస్ గానానికి పెద్ద పీట వేస్తూ సాగారు. తరువతి తరం హీరోల చిత్రాల్లోనూ ఏసుదాస్ మధురగానం మనసులను పులకింప చేసింది. ఏసుదాస్ తనయుడు విజయ్ ఏసుదాస్ సైతం అనేక తెలుగు చిత్రాలలో పాటలు పాడి అలరించారు. ఏసుదాస్ ను తమ సొంతమనిషిగా అభిమానించి, ఆరాధించే వారందరికీ ఆయన గాయకునిగా అరవైఏళ్ళు పూర్తి చేసుకోవడం ఓ పర్వదినం అనే చెప్పాలి. ఆ మధురగళం నుండి మరిన్ని పాటలు జనానికి మధురామృతం పంచుతూనే ఉంటాయని ఆశిద్దాం.
Also Read
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
- Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
- Trivikram: త్రివిక్రమ్తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
- Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
తాజావార్తలు
-
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!