Jana Nayagan: కావేరీ నీటిపై మళ్లీ ఉద్రిక్తత.. విజయ్ ‘జన నాయగన్’ స్క్రీనింగ్ను అడ్డుకున్న కార్యకర్తలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jana Nayagan: కావేరీ జలాల వివాదం మరోసారి కర్ణాటక, తమిళనాడు మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. 15 రోజుల పాటు ప్రతిరోజూ 3,500 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కావేరీ జల నియంత్రణ కమిటీ (CWRC) ఆదేశించడంతో కర్ణాటకలో నిరసనలు ఉధృతమయ్యాయి. ముఖ్యంగా మండ్య, మైసూరు జిల్లాల్లో రైతులు, కన్నడ సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. మండ్యలో నిరసనకారులు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా పోస్టర్లను చించివేశారు. ఆ సినిమా ప్రదర్శితమవుతున్న గురుశ్రీ థియేటర్ను ముట్టడించి ప్రదర్శన నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని థియేటర్ యాజమాన్యం ప్రదర్శనను నిలిపివేసినట్లు సమాచారం. అనంతరం కార్యకర్తలు థియేటర్ బయట నినాదాలు చేస్తూ తమ నిరసన కొనసాగించారు.
ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా తమిళనాడుకు నీరు విడుదల చేయవద్దని డిమాండ్ చేస్తూ నిరసనకారులు జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం కర్ణాటకలో తీవ్రమైన తాగునీటి కొరత ఉందని, ప్రజలకు, పశువులకు సరిపడా నీరు కూడా అందుబాటులో లేదని వారు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క చుక్క నీటిని కూడా విడుదల చేయరాదని ప్రభుత్వాన్ని కోరారు. మండ్య ప్రజలు ఎప్పుడూ కర్ణాటక ప్రయోజనాల కోసం ముందుండి పోరాడారని, ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని నిరసనకారులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నీటిని విడుదల చేస్తే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించారు. మరోవైపు మైసూరు-బెంగళూరు జాతీయ రహదారిపై సర్ ఎం. విశ్వేశ్వరయ్య విగ్రహం సమీపంలో నిరసనకారులు రోడ్డును దిగ్బంధించడంతో భారీ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకుని ముందుజాగ్రత్తగా నిర్బంధించారు. మైసూరులో కూడా ఖాళీ కుండలతో ప్రదర్శనలు నిర్వహిస్తూ కావేరీ నీటిని తమిళనాడుకు విడుదల చేయొద్దని డిమాండ్ చేశారు.
Also Read
- Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
- Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
- Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
ఈ పరిణామాలపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, CWRC ఆదేశంపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేస్తుందని, న్యాయపరమైన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. అలాగే కర్ణాటకలో నెలకొన్న నీటి సంక్షోభాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధులను కావేరీ జలాశయాలు సందర్శించాలని ఆహ్వానించారు. త మంగళవారం జారీ చేసిన ఆదేశాల్లో భాగంగా సుమారు నాలుగు టీఎంసీల నీటిని అందించేందుకు 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని CWRC సూచించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం మరోసారి వాడి వేడి రాజకీయ చర్చలకు దారితీసింది.
- Tags
- cinema
- Jana Nayagan
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!