ఈ టైమ్లో నరేష్ అట్లా మాట్లాడం కరెక్ట్ కాదు: బండ్ల గణేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న రాత్రి బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ప్రమాదానికి గురైయ్యారు. దీంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులతో పాటు అభిమానులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. అయితే సాయి తేజ్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడగా.. వైద్యానికి ఆయన స్పందిస్తున్నాడు అంటూ వైద్యులు తెలియజేయడంతో కుటుంబ సభ్యులతో పాటుగా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ తెలిపారు.
తేజూ ప్రమాదం గురించి తెలిసి మెగా కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు అపోలో హాస్పిటల్కు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మరికొంత మంది తేజూ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా ప్రార్థనలు చేశారు. మరోవైపు, తేజూ ప్రమాదంపై స్పందించిన సీనియర్ నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read
- John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్లో షూటింగ్!
- DC Success Gift : అందరికి ఇచ్చి 'వామికాగబ్బీ'కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
- Chandan Anand: ‘హనుమాన్ అంశ్’ తర్వాత మారిన చందన్ ఆనంద్ అదృష్టం.. సల్మాన్, షారుఖ్ సినిమాల్లో ఛాన్స్
- Ravi Teja : ఇరుముడి సూపర్హిట్తో రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ ?
నటుడు నరేష్ స్పందిస్తూ.. బైక్ రైడింగ్ విషయంలో తన కొడుకుని, సాయి ధరమ్ తేజ్ని చాలా సార్లు హెచ్చరించానని ఆయన అన్నారు. తన కుమారుడు, తేజూ మంచి స్నేహితులని.. తేజూ తనకు బిడ్డ లాంటివాడని చెప్పారు. శుక్రవారం సాయంత్రం తన ఇంటి నుంచే సాయి ధరమ్ తేజ్ బయలుదేరి వెళ్లాడని తెలిపారు. బైక్స్ వేగంగా నడపవద్దని నాలుగు రోజుల క్రితం ఇద్దరికీ కౌన్సిలింగ్ కూడా ఇద్దాం అనుకున్నానని.. ఇంతలోనే తేజూకి యాక్సిడెంట్ అయ్యిందన్నారు. తేజూ త్వరగా కోలుకుని, పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే తిరిగి సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని వెల్లడించారు.
అయితే, తాజాగా దీనిపై మెగా వీరాభిమాని, నటుడు బండ్ల గణేష్ స్పందించారు. ‘సాయి ధరమ్ తేజ్ గారు త్వరలోనే షూటింగ్ లు చేస్తారు.. బ్రహ్మాండంగా ఉంటారు, చిన్న ప్రమాదం జరిగింది. ఈ టైమ్ లో నరేష్ గారు.. మీరు ఎవరెవరో ప్రమాదవశాత్తు మరణించిన వారి పేర్లు చెప్పడం గాని, మీరు అట్లా మాట్లాడటం గాని కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎందుకు సార్..? రేసింగ్ చేశాడు.. అది, ఇది చేశాడు.. మీ ఇంటి దగ్గరకి వచ్చాడని.. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు సార్.. అంటూ బండ్ల వీడియో ద్వారా తెలియజేశారు. ఇట్లాంటప్పుడు ఆ పరమేశ్వరుడిని ప్రార్ధించి, త్వరగా కోలుకోవాలని హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి గాని, అవన్నీ ఇప్పుడు ఎందుకు..? అంటూ బండ్ల గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్లో షూటింగ్!
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్లోని అన్ని పదవులకు రాజీనామా
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?