Ashok Galla: ‘మురారి’ రీమేక్ చేయాలని ఉంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘హీరో’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా! ఏప్రిల్ 5న 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అశోక్ మీడియాతో తన కొత్త సినిమా విశేషాలను పంచుకున్నాడు. ముందుగా ‘హీరో’ ఇచ్చిన అనుభవాన్ని తలుచుకుంటూ, ”దాదాపు రెండేళ్ళ పాటు ఆ ప్రాజెక్ట్ కోసం పనిచేశాం. మొత్తానికి సంక్రాంతికి విడుదల చేసి, ఊపిరి పీల్చుకున్నాం. థియేటర్లో విడుదలైనప్పుడే కాదు ఆ తర్వాత ఓటీటీలో వచ్చినప్పుడూ చక్కని స్పందన లభించింది. అయితే సంక్రాంతికి ఉండాల్సిన కలెక్షన్లు లేవనే బాధ అయితే ఉంది” అని చెప్పారు. కరోనా ఆ సమయంలో పీక్స్ లో ఉండటంతో తమ సినిమా వసూళ్ల మీద కొంత ప్రభావం పడిందని అన్నారు. ఏడవ తరగతి నుండి తాను సింగపూర్ లోనే చదువుకున్నానని అక్కడ వెస్ట్రన్ డ్రామాస్ బాగా వేయించేవారని, అలా నటనలో అనుభవం చిన్నప్పటి నుండే వచ్చిందని, నిజానికి తనకు ఇంటెన్స్ క్యారెక్టర్స్, సెటిల్డ్ యాక్టింగ్ చేయడం ఇష్టమని అశోక్ గల్లా చెప్పారు.
సెకండ్ మూవీ కోసం కథలు వినడం మొదలు పెట్టానని, రెండు మూడు ఆసక్తికరమైన స్క్రిప్ట్స్ తన దగ్గరకు వచ్చాయని, అందులో ఒకదాన్ని ఫైనలైజ్ చేసి జూన్ లో షూటింగ్ మొదలు పెడతామని, ఇదే యేడాదిలో దాన్ని విడుదల చేస్తామని అశోక్ అన్నారు. ఓ నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే తన అభిమతమని, ప్రత్యేకంగా ఒక జానర్ కు పరిమితం కావడం ఇష్టం లేదని, మంచి స్క్రిప్ట్ వస్తే వెబ్ సీరిస్ చేయడానికైనా తాను సిద్ధమని చెప్పారు. ఇప్పుడు తెలుగులో పాన్ ఇండియా కల్చర్ బాగా పెరిగిందని, కానీ తను మాత్రం ముందు తెలుగు వారి మనసుల్ని గెలుచుకోవాలని అనుకుంటున్నానని, ఆ తర్వాతే పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తానని తెలిపారు. మహేశ్ బాబు సినిమాలు చూసి పెరిగిన తనపై ఆయన ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని, ఒకవేళ మహేశ్ సినిమాను రీమేక్ చేయాల్సి వస్తే తన ఛాయిస్ ‘మురారి’ అని, అలాంటి యూనిక్ సబ్జెక్ట్ ఏ హీరోకైనా దొరకడం కష్టమని అశోక్ అభిప్రాయపడ్డారు.
Also Read
ఆ రాత్రి ఏం జరిగిందంటే..
ఏప్రిల్ 2వ తేదీ రాత్రి రాడిసన్ బ్లూ హోటల్ లోని పబ్ లో జరిగిన రేవ్ పార్టీలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు పాల్గొన్నారు. వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో గల్లా అశోక్ కూడా ఉన్నాడనే వార్తలు 3వ తేదీ ఉదయమంతా మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఆ తర్వాత కొంత సేపటికి ఆ వార్తలను గల్లా కుటుంబ సభ్యులు ఖండించారు. అశోక్ ఆ పార్టీకి వెళ్ళలేదని వివరణ ఇచ్చారు. ఈ విషయం గురించి అశోక్ మాట్లాడుతూ, ”రెండవ తేదీ రాత్రి నేను ఫిజియోధెరపీ చేయించుకుని ఇంటికెళ్ళి హాయిగా పడుకున్నాను. తెల్లవారి లేచి ఫోన్ చూసుకుంటే… మీడియాలో ఆ పార్టీకి నేను వెళ్ళినట్టు వార్తలు కనిపించారు. ఈ వ్యవహారంలోకి నా పేరును ఎందుకు లాగారో తెలియదు. బహుశా సెలబ్రిటీ అన్న కారణంగా నా పేరుకు అంత ప్రాధాన్యం ఇచ్చి ఉండొచ్చు. సోషల్ మీడియాలో నా పేరు విపరీతంగా వైరల్ కావడంతో ఇప్పుడు నేను ‘హీరో’ననే భావన కలిగింది” అని అన్నారు. మీడియా సమావేశానంతరం తన తల్లి పద్మావతితో కలిసి అశోక్ బర్త్ డే కేక్ కట్ చేశారు.
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!