Allu Arjun: ఎస్పీ మెడకు చుట్టుకున్న అల్లు అర్జున్ ర్యాలీ
AP Govt To Take Action On Nandyal SP Raghuveer Reddy: సరిగ్గా ఎన్నికలకు ఒక్కరోజు ముందు నంద్యాల వెళ్లారు అల్లు అర్జున్. వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి తన స్నేహితుడు కావడంతో అతని కోసమే హైదరాబాద్ నుంచి వచ్చానని అల్లు అర్జున్ ప్రకటించారు. అయితే ఆ సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున జన సమీకరణ జరిపారంటూ అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర రెడ్డి మీద రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. తాజాగా ఈ అంశంలో నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి మీద చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అల్లు అర్జున్ జిల్లాకు వస్తున్నారు అనే సమాచారం తెలిసి కూడా ఎస్పీ స్పందించలేదని, ర్యాలీ నిర్వహించినా కూడా ఏమాత్రం స్పందన లేకుండా చోద్యం చూస్తూ ఊరుకున్నారని రఘువీర్ రెడ్డి మీద ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది.
AP Elections 2024: ఫైనల్లీ ఏపీ పోలింగ్ శాతం చెప్పేశారు.. 2019 కంటే ఎంత పెరిగిందంటే?
Also Read
పోలింగ్ కు 48 గంటల ముందు 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ వాటిని నంద్యాల పోలీసులు ఎస్పీ విస్మరించినట్లుగా వచ్చిన ఆరోపణలను ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నిర్ధారించినట్లయింది. నంద్యాల పోలీసుల వైఫల్యం మీద కర్నూలు రేంజ్ డీఐజీ ఇచ్చిన నివేదికతో పాటు రాష్ట్ర డిజిపి తీసుకోబోతున్న చర్యల వివరాలను ఈసీకి జవహర్ రెడ్డి పంపించారు. తన స్నేహితుడి కోసం అల్లు అర్జున్ నంద్యాల వస్తున్నారని విషయం తెలిసి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ముందు రోజు నుంచి అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నారని విషయం వాట్సాప్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని కనీసం పట్టించుకోకపోవడాన్ని పోలీసులు తప్పిదంగా పేర్కొన్నారు. అక్కడ వేలాదిమంది గుమిగూడిన వారిని అక్కడ నుంచి చెదరగొట్టే ప్రయత్నం పోలీసులు ఏమాత్రం చేయలేదని జవహర్ రెడ్డి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో నంద్యాల పోలీసులు విఫలమవడం నిజమేనని రెండు పార్టీలకు చెందిన వారు ఒకే సమయంలో పెద్ద ఎత్తున గుమికూడిన విషయాన్ని సైతం రఘువీర్ రెడ్డి తెలియజేయలేదని నివేదికలో ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో