యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి హీరోగా, లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. మహేష్ బాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యి యునానిమస్ గా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్ గా స్ప్రెడ్ అవడంతో రోజురోజుకీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బుకింగ్స్ పెరుగుతూనే ఉన్నాయి. అన్ని సెంటర్స్ లో హౌజ్ ఫుల్ బోర్డ్స్ తో ఈ మూవీ, జవాన్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా ముందు కూడా రాక్ సాలిడ్ గా నిలబడింది. ఓవర్సీస్ లో వన్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసిన మిస్ శెట్టి మిస్టర్ పలిశెట్టి సినిమా ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ అయిపొయింది. తమ సినిమాని ఇంత హిట్ చేసినందుకు అనుష్క, లేడీస్ కోసం స్పెషల్ గిఫ్ట్ ని ఇచ్చింది. ఈ గురువారం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్స్ లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాని లేడీస్ కోసం ఫ్రీగా మార్నింగ్ షో వేయనున్నారు.
ఇంట్లోని లేడీస్ తో తీసుకోని థియేటర్స్ కి రండి అంటూ అనుష్క స్పెషల్ వీడియో రిలీజ్ చేసి ఈ విషయాన్ని తెలిపింది. “it is heart warming to see all your love and response to ms shetty mr polishetty.. means the world to us… To celebrate this , we are organising a special morning show on this Thursday just for ladies across andhra pradesh / Telangana…see u all at the theatres
It is heart warming to see all your love and response to ms shetty mr polishetty.. means the world to us …🤗🧿🙏🏻🤗
To celebrate this , we are organising a special morning show on this Thursday just for ladies across andhra pradesh / Telangana…see u all at the… pic.twitter.com/JVMGrjhNVY— Anushka Shetty (@MsAnushkaShetty) September 12, 2023