Anushka Shetty: అనుష్క అభినయంలోని మహత్తు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anushka Shetty:అందం, అభినయం కలబోసిన రూపంతో ఎందరో తారలు అలరించారు. వారిలో తాను ప్రత్యేకం అంటూ అనుష్క శెట్టి మురిపించారు. పొడుగైన సుందరీమణులు ఎంత అందంగా ఉన్నా, అంతగా అలరించలేరని సినీజనం అంటూ ఉంటారు. వారి మాటను కొట్టి పారేస్తూ అనుష్క ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉండడం విశేషం. అనుష్క ఓ చిత్రంలో నాయికగా నటించింది అనగానే సదరు చిత్రం కోసం పరుగులు తీసేవారు జనం. ‘అరుంధతి’ గా అదరహో అనిపించిన అనుష్క అభినయం, తరువాత ‘బాహుబలి’ రెండు భాగాల్లోనూ ఎంతగానో మురిపించారామె. దాంతో అనుష్క అరుదైన అభినేత్రిగా జనం మదిలో నిలచారు. అందువల్లే ‘సైరా…నరసింహారెడ్డి’ కథ ఆమె పాత్ర ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అనుష్క ఏ చిత్రంలోనూ నటించక పోయినా, ఇంతకు ముందు ఆమె నటించిన చిత్రాలను చూస్తూ అభిమానులు ఆనందిస్తున్నారు. అదీ అనుష్క అభినయంలోని మహత్తు!
అనుష్క శెట్టి 1981 నవంబర్ 7న కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు. ఇంట్లో ‘స్వీటీ శెట్టి’గా ఆమె సాగారు. చిత్రసీమకు వచ్చాకే అనుష్కగా మారారు. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్ లో బ్యాచ్ లర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో పట్టా పొందిన అనుష్క తరువాత యోగసాధనతో మెరుపు తీగెలా మారారు. కొన్నాళ్ళు యోగా పంతులమ్మగానూ పనిచేశారు. ఈ పొడుగాటి సుందరి అందం పూరి జగన్నాథ్ ను పట్టేసింది. దాంతో ‘సూపర్’ చిత్రంతో తెరకు పరిచయం చేశారు పూరి. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయినా, అనుష్క అందం మాత్రం జనానికి బంధం వేసింది. నాగార్జున కుటుంబంతో అనుబంధం పెంచుకున్న అనుష్క, వారి ఇంట్లో అమ్మాయిలా ‘స్వీటీ’గానే అభిమానం సంపాదించారు. నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, చిరంజీవి అందరి సరసనా చిందేసి కనువిందు చేశారు అనుష్క. తరువాతి తరం హీరోలయిన ప్రభాస్, మహేశ్, గోపీచంద్ తోనూ జోడీ కట్టి ఆకట్టుకున్నారు. ఎవరితో నటించినా, ప్రభాస్ కు అనుష్క హిట్ పెయిర్ అని చెప్పవచ్చు. వీరిద్దరూ నటించిన ‘మిర్చి, బాహుబలి-1, బాహుబలి-2’ చిత్రాలు వరుసగా ఘనవిజయం సాధించడం విశేషం. అందంతో బంధాలు వేయడమే కాదు, అభినేత్రిగానూ అనుష్క మురిపించారు. ‘సైజ్ జీరో’ కోసం బరువు పెరిగి దరువేసి మరీ ఉత్తమ నటిగా నంది అవార్డును దక్కించుకున్నారు అనుష్క.
Also Read
- Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. 'ఫౌజీ' ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
- The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన 'ది రాజాసాబ్'.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
- Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
‘బాహుబలి-2’ తరువాత అనుష్క నటించిన ‘భాగమతి’ భలేగా మార్కులు సంపాదించింది. ఓటీటీలో నేరుగా విడుదలైన అనుష్క చిత్రం ‘నిశ్శబ్దం’ టైటిల్ కు తగ్గట్టుగానే ఏ లాంటి శబ్దమూ చేయలేకపోయింది. నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందుతోన్న చిత్రంలో అనుష్క నాయికగా నటిస్తూ ఉండడం విశేషం! మునుపటిలా అనుష్క అభినయంతో అలరిస్తే చూడాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. మరి రాబోయే సినిమాలో అనుష్క నటన ఏ తీరున జనాన్ని మురిపిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?