Anushka Shetty: అనుష్క అభినయంలోని మహత్తు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anushka Shetty:అందం, అభినయం కలబోసిన రూపంతో ఎందరో తారలు అలరించారు. వారిలో తాను ప్రత్యేకం అంటూ అనుష్క శెట్టి మురిపించారు. పొడుగైన సుందరీమణులు ఎంత అందంగా ఉన్నా, అంతగా అలరించలేరని సినీజనం అంటూ ఉంటారు. వారి మాటను కొట్టి పారేస్తూ అనుష్క ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉండడం విశేషం. అనుష్క ఓ చిత్రంలో నాయికగా నటించింది అనగానే సదరు చిత్రం కోసం పరుగులు తీసేవారు జనం. ‘అరుంధతి’ గా అదరహో అనిపించిన అనుష్క అభినయం, తరువాత ‘బాహుబలి’ రెండు భాగాల్లోనూ ఎంతగానో మురిపించారామె. దాంతో అనుష్క అరుదైన అభినేత్రిగా జనం మదిలో నిలచారు. అందువల్లే ‘సైరా…నరసింహారెడ్డి’ కథ ఆమె పాత్ర ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అనుష్క ఏ చిత్రంలోనూ నటించక పోయినా, ఇంతకు ముందు ఆమె నటించిన చిత్రాలను చూస్తూ అభిమానులు ఆనందిస్తున్నారు. అదీ అనుష్క అభినయంలోని మహత్తు!
అనుష్క శెట్టి 1981 నవంబర్ 7న కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు. ఇంట్లో ‘స్వీటీ శెట్టి’గా ఆమె సాగారు. చిత్రసీమకు వచ్చాకే అనుష్కగా మారారు. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్ లో బ్యాచ్ లర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో పట్టా పొందిన అనుష్క తరువాత యోగసాధనతో మెరుపు తీగెలా మారారు. కొన్నాళ్ళు యోగా పంతులమ్మగానూ పనిచేశారు. ఈ పొడుగాటి సుందరి అందం పూరి జగన్నాథ్ ను పట్టేసింది. దాంతో ‘సూపర్’ చిత్రంతో తెరకు పరిచయం చేశారు పూరి. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయినా, అనుష్క అందం మాత్రం జనానికి బంధం వేసింది. నాగార్జున కుటుంబంతో అనుబంధం పెంచుకున్న అనుష్క, వారి ఇంట్లో అమ్మాయిలా ‘స్వీటీ’గానే అభిమానం సంపాదించారు. నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, చిరంజీవి అందరి సరసనా చిందేసి కనువిందు చేశారు అనుష్క. తరువాతి తరం హీరోలయిన ప్రభాస్, మహేశ్, గోపీచంద్ తోనూ జోడీ కట్టి ఆకట్టుకున్నారు. ఎవరితో నటించినా, ప్రభాస్ కు అనుష్క హిట్ పెయిర్ అని చెప్పవచ్చు. వీరిద్దరూ నటించిన ‘మిర్చి, బాహుబలి-1, బాహుబలి-2’ చిత్రాలు వరుసగా ఘనవిజయం సాధించడం విశేషం. అందంతో బంధాలు వేయడమే కాదు, అభినేత్రిగానూ అనుష్క మురిపించారు. ‘సైజ్ జీరో’ కోసం బరువు పెరిగి దరువేసి మరీ ఉత్తమ నటిగా నంది అవార్డును దక్కించుకున్నారు అనుష్క.
Also Read
- NTRNeel : ఎన్టీఆర్ బర్త్డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
‘బాహుబలి-2’ తరువాత అనుష్క నటించిన ‘భాగమతి’ భలేగా మార్కులు సంపాదించింది. ఓటీటీలో నేరుగా విడుదలైన అనుష్క చిత్రం ‘నిశ్శబ్దం’ టైటిల్ కు తగ్గట్టుగానే ఏ లాంటి శబ్దమూ చేయలేకపోయింది. నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందుతోన్న చిత్రంలో అనుష్క నాయికగా నటిస్తూ ఉండడం విశేషం! మునుపటిలా అనుష్క అభినయంతో అలరిస్తే చూడాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. మరి రాబోయే సినిమాలో అనుష్క నటన ఏ తీరున జనాన్ని మురిపిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..