NTV Telugu Site icon

Allu Sneha Reddy: స్నేహా రెడ్డి ఒంటరిగా తిరుమలకు వెళ్లడానికి కారణం ఏంటో తెలుసా?

Sneha Reddy

Sneha Reddy

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పిల్లల గురించి, అల్లు అర్జున్ సినిమాల విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది.. మొన్నీమధ్య స్నేహా రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె ఒక్కరే తిరుమలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఇలా నెలలో కచ్చితంగా రెండు మూడు సార్లు తిరుమలలోనే కనిపిస్తుంది. రీసెంట్ గానే తన కూతురు అల్లు అర్హతో తిరుమలలో స్నేహ రెడ్డి కనిపించింది.కానీ కూతురితో కలిసి వెళ్ళిన కొద్ది రోజులకే మళ్ళీ స్నేహ రెడ్డి తిరుమల వెళ్ళింది. మాములుగా ఎవరైనా కూడా ఏడాదికి ఒకటి, రెండు సార్లు మాత్రమే వెళ్తారు.. కానీ ఈమె ఇలా వరుస ఎందుకు వెళ్తుంది అనే సందేహాలు కూడా జనాలకు వస్తుంది.. అయితే స్నేహా రెడ్డి ఒక్కటే తిరుమలకు వెళ్లడం ఏంటి? అనే ప్రశ్నలు ఫ్యాన్స్ లో మొదలయ్యాయి..

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ఎక్కువమంది విజిట్ చేసే హిందూ దేవాలయం. ఇక్కడ 365 రోజులు భక్తులు వస్తూనే ఉంటారు. ఎక్కడెక్కడి నుంచే భక్తులు వచ్చి వెంకన్నను దర్శనం చేసుకుంటారు.. సినీ ఇండస్ట్రీ నుండి కూడా చాలామంది సెలబ్రిటీలు వెళ్తూ ఉంటారు. ఇక బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కూడా తిరుమల కి ప్రతిసారి వస్తూ ఉంటుంది.. అలాగే స్నేహా రెడ్డి కూడా వెళ్తుంది. అయితే ఈమె ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు ఆ పనిలో విజయం సాధించాలని వెళ్తుందట.. అలాగే ఆ పని పూర్తి అయితే మళ్లీ వెళ్తుందట.. ఇలా ఆమె నెలకు రెండు మూడు సార్లు తిరుమల దర్శనానికి వెళ్తుందని సమాచారం.. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌ కనిపించనుంది. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న సినిమా విడుదల కాబోతుంది..