మెగా కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, యువ హీరో అల్లు శిరీష్ వివాహ వేడుకకు సర్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే శిరీష్ తన వివాహ ఆహ్వాన పత్రికను మెగా కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా అల్లు శిరీష్ తన తండ్రి అల్లు అరవింద్, తల్లి నిర్మలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. అక్కడ పవన్ కళ్యాణ్, ఆయన ధర్మపత్ని అన్నాలెజ్నేవాను కలిసి తన పెళ్లికి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న శిరీష్, తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. “నాన్న, అమ్మతో కలిసి పవన్ కళ్యాణ్ గారు, లెజ్నేవా గారిని కలిసి నా పెళ్లికి ఆహ్వానించాను. వారు నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు” అంటూ ట్వీట్ చేశారు.
Also Read:Kiran Abbavaram: భారీగా రెమ్యునరేషన్ పెంచిన కిరణ్ అబ్బవరం?
పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా, మెగా బ్రదర్ నాగబాబు, ఆయన భార్య పద్మజని కూడా శిరీష్ ప్రత్యేకంగా కలిసి పెళ్లి వేడుకలకు ఆహ్వానించారు. మెగా మరియు అల్లు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ కలయిక మరోసారి చాటిచెప్పింది. రాజకీయ, సినిమా రంగాల్లో బిజీగా ఉన్నప్పటికీ, అల్లు శిరీష్ను పవన్ కళ్యాణ్ ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించి అభినందనలు తెలిపారు. అల్లు అరవింద్ దంపతులు స్వయంగా వెళ్లి మెగా సోదరులను కలవడం గమనార్హం. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతుండటంతో మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా అల్లు శిరీష్ పెళ్లి గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఇప్పుడు స్వయంగా ఆయనే పెద్దలను ఆహ్వానిస్తుండటంతో, వివాహ ముహూర్తం దగ్గరపడిందని స్పష్టమవుతోంది. త్వరలోనే ఈ వేడుకకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
Dad, amma and me had visited @PawanKalyan garu & Smt Lezhneva and invited them for our wedding. Also invited @NagaBabuOffl and Smt Padmaja for all our wedding festivities. All of them were very happy for me! ❤️✨ pic.twitter.com/ZNIFkkWEPL
— Allu Sirish (@AlluSirish) February 23, 2026
