ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఆర్య, ఆర్య 2 లాంటి విభిన్నమైన ప్రేమ కథలను తెరకెక్కించిన దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం పుష్ప సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుందని ఇటీవల ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పష్టం చేశారు. అయితే ఈ మూవీ రెండో భాగానికి ఓ ప్రత్యేకమైన టైటిల్ను పెట్టాలని చిత్రబృందం ఆలోచిస్తుందని తెలిసింది. త్వరలోనే కొత్త పేరును ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తారట. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. బన్నీ కూడా కరోనా నుంచి కోలుకోగా, వేవ్ తగ్గుముఖం పట్టాక షూటింగ్ ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది.