Allu Aravind: అల్లు అరవింద్ అన్నది మహేష్ బాబు డైరెక్టర్ నేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Aravind: టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటి గీతా ఆర్ట్స్. ప్రస్తుతం వస్తున్న స్టార్ హీరోల సినిమాల్లో చాలావరకు గీతా ఆర్ట్స్ వారివే ఉన్నాయి. ఇక దాని అధినేత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి సినిమా అని తెలియడం ఆలస్యం.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెలుగువారికి అందించడానికి రెడీ అయిపోతారు. గతంలో కాంతార లాంటి రా అండ్ రస్టిక్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించింది అల్లు అరవింద్ యే. ఇక ఇప్పుడు మళయాలంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన 2018 సినిమాను తెలుగు ప్రేక్షకులకు గీతా ఆర్ట్స్ నే అందించింది. ఇక ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకొని భారీ కలక్షన్స్ ను రాబడుతోంది. ఈ నేపథ్యంలోనే నేడు థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ థాంక్స్ మీట్ కు కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ మీట్ లో అల్లు అరవింద మాట్లాడిన కొన్ని మాటలు.. డైరెక్టర్ పరుశురామ్ పెట్ల ను ఉద్దేశించే అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.
Mohan Babu: మోహన్ బాబు వంద కోట్ల సినిమా.. ప్రొడ్యూసర్ ఎవరంటే..?
Also Read
- Dil Raju: 'సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..': ప్రొడ్యూసర్ దిల్ రాజు
- Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
- Trisha: 'తోడు దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటా..' పెళ్లిపై త్రిష బోల్డ్ స్టేట్మెంట్!
- Prithviraj Sukumaran: మోహన్లాల్ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
గీతా గోవిందం లాంటి సినిమాను నిర్మించి.. పరుశురామ్ ను స్టార్ డైరెక్టర్ గా చేసింది గీతా ఆర్ట్స్.. ఒక విధంగా చెప్పాలంటే అల్లు అరవింద్. ఇక ఈ సినిమా తరువాత మరో సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చినా పరుశురామ్.. మధ్యలోనే వారిని వదిలేసి.. మరో సినిమాకు సైన్ చేశాడు. ఆ విషయమై అల్లు అరవింద్ ఎప్పుడు మాట్లాడింది లేదు. ఇక తాజాగా ఈ థాంక్స్ మీట్ లో ఇన్ డైరెక్ట్ గా చురకలు వేశాడు.. ” చందు మొండేటి.. కార్తికేయ 2 వచ్చి ఏడాది దాటిపోయింది. కార్తికేయ కన్నా ముందే ఆయనతో రెండు సినిమాలు కమిట్ అయ్యాం. ఈ కారణంగా ఆ తర్వాత అతడికి ఎన్నో ఆఫర్లు వచ్చినా మా గురించి దేన్ని కూడా ఒప్పుకోలేదు. ఇప్పటికి ఆయన ఆ సినిమాల కోసమే ఎదురుచూస్తున్నాడు. కానీ, నా ద్వారా పైకి వచ్చిన కొందరు దర్శకులు పేర్లు చెప్పను కానీ.. వాళ్లు గీత దాటి వెళ్లి పని చేసుకున్నారు. కానీ ఈయన నిలబడిపోయి ఉన్నాడు” అని చెప్పుకొచ్చాడు.ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు అది పరుశురామ్ నే అన్నాడు అన్న విషయం తెలియకుండా పోదు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే పరుశురామ్.. చివరగా మహేష్ బాబుతో సర్కారువారి పాట సినిమాకు దర్శకత్వం వహించాడు. మరి ఈ డ్యామేజ్ వలన ఈ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది.
సినిమా బాగుంది కాబట్టే అన్ని కోట్లు వచ్చాయి.. Allu Aravind At 2018 Movie Thank You Meet
Watch Video>>>https://t.co/Xgq7RTAbhz#ChandooMondeti #BunnyVasu #AlluAravind #2018TheMovie #TovinoThomas #NTVENT
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) June 1, 2023
తాజావార్తలు
-
Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..