బాలయ్యతో అల్లు బిజినెస్ స్ట్రాటెజీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవర్ ద టాప్ ఫ్లాట్ ఫామ్ లోకి మెల్లగా టాప్ స్టార్స్ కూడా అడుగు పెడుతున్నారు. మాస్ లో విశేషమైన ఫాలోయింగ్ ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అడుగు పెట్టడం విశేషమనే చెప్పాలి. ఇక ఆ ఫ్లాట్ ఫామ్ బాలయ్య బాక్సాఫీస్ పోటీదారుడైన చిరంజీవి మెగా ఫ్యామిలీకి చెందిన వారిది కావడం మరింత విశేషం. బాలయ్య నిర్వహించే ‘అన్ స్టాపబుల్’ టాక్ షో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ భాగస్వామిగా ఉన్న ‘ఆహా’ ఓటీటీలో మొదలు కానుంది. దాంతో ‘ఆహా’కు బాలయ్య ఎలా టైమ్ కేటాయించారో అన్నది చర్చనీయాంశమయింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారు.
Read Also : పొట్టివాడు నిజంగానే గట్టివాడు!
Also Read
- BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
- Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
- OG 2: పవన్ కళ్యాణ్ బర్త్డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
- Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్కు చిరంజీవి మెగా బర్త్డే విషెస్!
అదీగాక ఇంతకు ముందు చిరంజీవి, నాగార్జున, జూనియర్ యన్టీఆర్ వంటి టాప్ స్టార్స్ బుల్లితెరపై హోస్ట్స్ గా కనిపించినా, అవి ఓటీటీకి చెందినవి కావు. పైగా అవి టాక్ షోస్ కూడా కాదు. ఆ కోణంలో చూస్తే తెలుగునాట ఓటీటీలో టాక్ షో చేస్తున్న తొలి టాప్ స్టార్ నందమూరి బాలకృష్ణ అనే చెప్పాలి. అందువల్ల కూడా బాలకృష్ణ ఈ కార్యక్రమ నిర్వహణకు అంగీకరించి ఉంటారని వినిపిస్తోంది. అదీగాక, బిజినెస్ యాంగిల్ లో చూసినా బాలకృష్ణ వంటి మాస్ హీరో వచ్చి, ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమం నిర్వహిస్తే వచ్చే కిక్కే వేరనీ కొందరి మాట! ఇప్పటి దాకా బాలయ్య బుల్లితెరపై ఏలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. దాంతో బాలయ్య తొలిసారి చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షోకు జనాల్లో ఓ స్పెషల్ క్రేజ్ నెలకొనడం సహజమే! ఇక నటరత్న యన్టీఆర్ కుటుంబానికి, అల్లు రామలింగయ్య ఫ్యామిలీకి ఏ నాటి నుంచో అనుబంధం ఉంది. అలా బాలయ్యకు అల్లు అరవింద్ చిన్ననాటి మిత్రుడు. ఆ కారణంగానే బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ షోకు అంగీకరించి ఉంటారని ఇంకొందరు చెబుతున్నారు. ఈ విషయంలో అల్లు అరవింద్ బిజినెస్ స్ట్రాటజీ పనిచేస్తుందని కొందరు అంటున్నారు. ఎందుకంటే వ్యూహాలు రచించడంలో అల్లు అరవింద్ కు ఆయనే సాటి అంటూ ఉంటారు సినీజనం.
అయితే ఇక్కడ మరో అంశం కూడా వినిపిస్తోంది. యన్టీఆర్ నెలకొల్పిన ‘తెలుగుదేశం’ పార్టీ ద్వారానే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఓ వెలుగు వెలిగారు. తరువాత ఆయన తెలుగుదేశం పార్టీలోనే మంత్రిపదవినీ నిర్వహించారు. అలా కేసీఆర్ తోనూ మొదటి నుంచీ బాలయ్యకు సాన్నిహిత్యం ఉంది. ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన మైహోమ్ రామేశ్వరరావుకు చెందినది. ఈ కోణంలోనూ బాలయ్య ఈ ప్రోగ్రామ్ చేయడానికి అంగీకరించి ఉండవచ్చునని మరికొందరి మాట. ఏది ఏమైనా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి బాలయ్య అడుగు పెట్టడం అన్నది భవిష్యత్ లో ఆ వేదికకు మరింత క్రేజ్ సంపాదించి పెడుతుందని భావించవచ్చు. ఒక వేళ బాలయ్య అరవింద్ ను చూసి ఈ ప్రోగ్రామ్ అంగీకరించినా, లేక రామేశ్వరరావు వల్ల ఒప్పుకున్నా ఆయన స్నేహానికి ఇచ్చే విలువ ఏమిటో ఇట్టే అర్థమవుతోంది.
తాజావార్తలు
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
-
Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
OG 2: పవన్ కళ్యాణ్ బర్త్డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
-
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్కు చిరంజీవి మెగా బర్త్డే విషెస్!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!