Allari Naresh:’అల్లరి’ నరేష్ కథానాయకుడిగా ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. జీ స్టూడియోస్తో కలిసి హాస్య మూవీస్పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీజర్కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి. సినిమా కథాంశాన్ని ఆవిష్కరించిన టీజర్ వీడియోలో ‘అల్లరి’ నరేష్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని గిరిజన ప్రాంతమైన మారేడుమిల్లిలో ఎన్నికల విధులకు వచ్చిన ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించారు. గురువారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో నరేష్, అతని సహచరులు, పోలీసు అధికారులతో కలిసి గిరిజన ప్రాంతంలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది.
ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రను పోషించారు. బాలాజీ గుత్తా సహనిర్మాత వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. రాంరెడ్డి సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.