Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Alaya Shikharam Completes 40 Years

Alaya Shikharam: నాలుగు పదుల ‘ఆలయశిఖరం’

Published Date :May 7, 2023 , 6:40 am
By Prasanna Pradeep
Alaya Shikharam: నాలుగు పదుల ‘ఆలయశిఖరం’
  • Follow Us :
  • google news
  • dailyhunt

Alaya Shikharam Completes 40 Years: మెగాస్టార్ చిరంజీవి, వైవిధ్య చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ మధ్య అనుబంధం విశేషమైనది. దర్శకుడు కోడి రామకృష్ణ తొలిచిత్రం ‘ఇంట్లోరామయ్య-వీధిలో క్రిష్ణయ్య’ హీరో చిరంజీవి. అలాగే చిరంజీవి కెరీర్ లో 500 రోజులు చూసిన ఏకైక చిత్రంగా నిలచింది ఆ సినిమానే. అలా ‘ఇంట్లో రామయ్య-వీధిలో క్రిష్ణయ్య’తో ఘనవిజయం చూసిన చిరంజీవి, కోడి రామకృష్ణ కాంబినేషన్ లో రెండవ చిత్రంగా ‘ఆలయశిఖరం’ తెరకెక్కింది. ఈ కాంబో వల్ల తొలి నుంచీ ‘ఆలయశిఖరం’పై అంచనాలు ఉండేవి. ఇక చిరంజీవి, సుమలత కలసి అంతకు ముందు ‘శుభలేఖ’లో నటించి విజయం చూశారు. సుమలత ఇందులో నాయిక కావడం వల్ల కూడా ‘ఆలయశిఖరం’పై సినీఫ్యాన్స్ ఆసక్తి పెంచుకున్నారు. 1983 మే 7వ తేదీన విడుదలైన ‘ఆలయశిఖరం’ మంచి ఆదరణ పొందింది.

ఇంతకూ ‘ఆలయశిఖరం’లోని కథ ఏమిటంటే – శీను గుర్రపు బండి తోలుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ఆడంబరాలకు పోయే అన్న రాజశేఖర్, ఆశల పల్లకిలో ఊరేగే చెల్లెలు, బాధ్యతలేని తండ్రి, ఉన్నంతలో కాపురాన్ని నెట్టుకు వచ్చే తల్లి శీనుకు ఉన్న కుటుంబం. పూలమ్మే రాధకి శీను అంటే ప్రేమ. శీను అన్న రాజశేఖర్, సత్యమూర్తి అనే కోటీశ్వరుని కూతురును పెళ్ళాడతాడు. దాంతో సొంతవారినే నీచంగా చూడడం మొదలెడతాడు. శీను చెల్లెలు ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. పెళ్ళికి ఆ అబ్బాయి తల్లి బోలెడు కోరికలు చెబుతుంది. అన్నిటికీ తన పెద్ద కొడుకు ఉన్నాడు కదా అని శీను తండ్రి మాట ఇచ్చేస్తాడు. రాజశేఖర్ పట్టించుకోడు. తాను తమ్ముడిలా చూసుకొనే గుర్రాన్ని, బండిని ఇరవై వేలకు అమ్మేస్తాడు శీను. ఆ డబ్బును కూడా దోచేసి, శీను తండ్రి పేకాట ఆడాలని చూస్తాడు. అది తెలిసిన జనం ఛీ కొడతారు.

Also Read

  • Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
  • Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
  • Rashmika-Mysa: ‘మైసా’ షూటింగ్ అప్‌డేట్ అదిరిపోయింది..!
  • NBK 111 : బాలయ్య సంచలన నిర్ణయం: రెమ్యునరేషన్ తగ్గించుకున్న నటసింహం.. కారణం అదేనా?

దాంతో అతనిలో మార్పు వస్తుంది. రిక్షా లాగుతూ ఉంటాడు. శీను ఉన్న డబ్బుతో చెల్లి పెళ్ళి జరిపిస్తాడు. సత్యమూర్తి ఫ్యాక్టరీలో దొంగసరుకు తయారవుతోందని తెలిసి చాకిరేవు పత్రిక సంపాదకుడు రాస్తాడు. అతడిని సత్యమూర్తి చంపిస్తాడు. ఆ నేరం రాజశేఖర్ పై పడుతుంది. రాజశేఖర్ ను అరెస్ట్ చేస్తారు. అన్న జైలులో ఉంటే వెళ్ళి అసలు ఏం జరిగిందని శీను అడుగుతాడు. రాజశేఖర్ భార్య సైతం అతనే హంతకుడని, అతనితో కలసి జీవించడానికి అయిష్టత చూపుతుంది. ఆ చాకిరేవు పత్రిక సంపాదకుని కొడుకునే శీను చెల్లెలు పెళ్ళాడి ఉంటుంది. దాంతో ఆమె కాపురం కూడా కష్టాల పాలవుతుంది. రాజశేఖర్ కు కోర్టు ఉరిశిక్ష విధిస్తుంది. పత్రికా సంపాదకుణ్ణి చంపేయడానికి కారకుడైన సత్యమూర్తి నౌఖరు అవతారం, సత్యమూర్తి మాటలు రికార్డ్ చేసి ఉంటాడు. అది చూపి సత్యమూర్తిని బ్లాక్ మెయిల్ చేస్తాడు. అదే సమయంలో తన అన్న నిర్దోషి అని తెలుసుకున్న శీను, అవతారం కోసం గాలిస్తుంటాడు. అవతారాన్ని కూడా చంపేయాలని సత్యమూర్తి భావిస్తాడు. శీను, అతని తండ్రి, రాధ అందరూ కలసి మారువేషాలు వేసుకొని అవతారాన్ని విడిపిస్తారు. అతడిని రౌడీలు పొడిచేస్తారు. శీను గుర్రం వచ్చి, సత్యమూర్తిని చితక్కొడుతుంది. చివరి నిమిషంలో రాజశేఖర్ కు ఉరిశిక్ష తప్పుతుంది. నిర్దోషిగా విడుదలై, కన్నవారితో కలసి ఉంటాడు. రాధను పెళ్ళాడిన శీను తన గుర్రం బండి తోలుతూ సాగుతాడు.

ఈ చిత్రంలో రంగనాథ్, రీనా, ముచ్చర్ల అరుణ, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, డబ్బింగ్ జానకి, కాకినాడ శ్యామల, సుశీల, పి.యల్.నారాయణ, రాళ్ళపల్లి తదితరులు నటించారు. ఈ చిత్రానికి గొల్లపూడి రచన చేయగా, సి.నారాయణ రెడ్డి, ఆరుద్ర, గోపి, ఉపద్రష్టసాయి పాటలు రాశారు. సత్యం సంగీతం సమకూర్చారు. ‘ఇది ఆశలు రేపే లోకం..’ అనే పాటను ప్రకాశ్ అనే గాయకుడు ఆలపించారు. శ్రీలలితా పిక్చర్స్ పతాకంపై జి.జగదీశ్ చంద్ర ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులోని “ఇది ఆశలు రేపే లోకం…”, “నీ రూపు మారింది గోపాలుడా…”, “కొండలెక్కినా దేవుడా…”, “తప్పేముందిర ఉన్నది సెబితే…” అంటూ సాగే పాటలు అలరించాయి.

చిరంజీవితో తాను తెరకెక్కించిన తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య-వీధిలో క్రిష్ణయ్య’ టైటిల్ ను పిల్లలు రాసుకొనే పలక (Slate)పై ప్రచురించారు కోడి. ఈ ‘ఆలయశిఖరం’ టైటిల్ ను బ్లాక్ బోర్డ్ పై వేయడం విశేషం! తన గురువు దాసరి నారాయణరావుతో చిత్రాలు నిర్మించిన వారితో తరువాతి రోజుల్లో కోడి రామకృష్ణ కూడా సినిమాలు తీశారు. అలా దాసరితో ‘ఇదెక్కడి న్యాయం’, ‘కోరికలే గుర్రాలయితే’ నిర్మించిన జి.జగదీశ్ చంద్రప్రసాద్ ఈ సినిమాను కోడి దర్శకత్వంలో నిర్మించారు. తిరుపతి, ఆ పరిసర ప్రాంతాల్లోనే ‘ఆలయశిఖరం’ షూటింగ్ జరుపుకుంది.

Read Also: Mohammed Siraj : పద్దతి మార్చుకో సిరాజ్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Alaya Shikharam
  • Chiranjeevi
  • Kodi Ramakrishna
  • Sumalatha

తాజావార్తలు

  • Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు

  • న్యూ లుక్‌లో YS Jagan.. యూరప్ టూర్‌కు బయల్దేరిన మాజీ సీఎం.!

  • Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్‌, తాజా అప్‌డేట్ ఇదే!

  • Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..

  • Ishan Kishan: కెప్టెన్‌గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions