Aishwarya Rajinikanth: ధనుష్తో విడాకుల తర్వాత.. ఆ పనికి సిద్ధమైన ఐశ్వర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aishwarya Rajinikanth Getting Ready To Direct A Film After 5 Years: దక్షిణాదిలోని ఆదర్శ దంపతులుగా నిలిచిన జంటల్లో ధనుష్, ఐశ్వర్య జంట ఒకటి. అలాంటి దంపతులు విడాకులు తీసుకోవడంతో యావత్ సినీ పరిశ్రమ షాక్కి గురయ్యింది. సడెన్గా తమ డివోర్స్ సంగతి చెప్పడంతో.. చాలామంది అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇందుకు కారణాలేంటన్న విషయంపై రకరకాల రూమర్లైతే చక్కర్లు కొడుతున్నాయి కానీ, ఇంతవరకూ సరైన స్పష్టత మాత్రం రాలేదు. అయితే.. ధనుష్ మాత్రం విడాకుల తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. మరి.. ఐశ్వర్య సంగతేంటి? ఆమె ఏం చేస్తోంది? అనేది చర్చనీయాంశమైంది. ఐశ్వర్య కూడా తన తదుపరి ప్లాన్స్ ఏంటన్నది ఎప్పుడూ రివీల్ చేయలేదు.
ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. ఐశ్వర్య రజినీకాంత్ త్వరలోనే మళ్లీ మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోందని, ఇందులో రజినీకాంత్ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. ఇంతకుమించి ఈ ప్రాజెక్ట్ గురించి మరే ఇతర వివరాలు వెలుగులోకి రాలేదు. కాగా.. ఐశ్వర్య 2012లోనే డైరెక్టర్గా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే! తన మాజీ భర్త ధనుష్తో కలిసి ‘3’ మూవీ చేసింది. ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటించగా, అనిరుధ్ సంగీత దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించలేదు కానీ, ‘వై దిస్ కొలవెరీ’ పాట పుణ్యమా అని అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Also Read
- Dancers Association Rift: 'ఉప ఎన్నికల'కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. 'పూర్తి ఎన్నికలు' కావాలంటున్న అసమ్మతి వర్గం!
- TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
- NBK 111 Release Date : సంక్రాంతి కాదు.. బాలయ్య - గోపీచంద్ మలినేని NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్?
- Mahendragiri Varahi : థియేటర్లలోకి వారాహి అమ్మవారి ఆగమనం.. 'మహేంద్రగిరి వారాహి' టీమ్ వినూత్న ప్రమోషన్స్!
ఆ చిత్రం తర్వాత 2014లో ‘వై రాజా వై’ అనే సినిమాకి ఐశ్వర్య దర్శకత్వం వహించింది. అనంతరం 2017లో సినీ స్టంట్ మాస్టర్స్ ఇతివృత్తంతో ‘సినిమా వీరన్’ అనే డాక్యుమెంటరీ తీసింది. అంతే.. ఆ తర్వాత మళ్లీ సినిమాల జోలికి వెళ్లలేదు. ఇప్పుడు ధనుష్తో విడాకులు తీసుకున్నాక, ఐదేళ్ల తర్వాత మరోసారి దర్శకులుగా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా భారీ బడ్జెట్తో రూపొందనుందని, ఐశ్వర్య అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని మలచనుందని తెలిసింది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?