Khushboo: ఖుషీ చేసిన ఖుష్బూ నటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Khushboo Birthday Special: ఇప్పుడంటే ఖుష్బూ కేరెక్టర్ రోల్స్ లో కనువిందు చేస్తున్నారు కానీ, అప్పట్లో ఆమె అందం అనేక చిత్రాలలో చిందులు వేసి కనువిందు చేసింది. ఉత్తరాదిన ఉదయించిన ఖుష్బూ అందం, దక్షిణాది చిత్రాలతోనే వెలుగులు విరజిమ్మింది. తమిళ చిత్రసీమలో అనేక ఘనవిజయాలను చూసింది ఖుష్బూ. తమిళ జనం ఖుష్బూకు గుడి కట్టి పూజలు చేయడం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకున్నారు.
ఖుష్బూ అసలు పేరు నఖత్ ఖాన్. 1970 సెప్టెంబర్ 29న ముంబయ్ లో జన్మించారామె. బాలనటిగా “ద బర్నింగ్ ట్రెయిన్, లావారిస్, కాలియా, దర్ద్ కా రిస్తా” వంటి చిత్రాలలో నటించిన ఖుష్బూ, అనిల్ కపూర్ ‘మేరీ జంగ్’లో “బోల్ బేబీ బోల్…” పాటలో చిందులతో ఆనందం పంచింది. జాకీ ష్రాఫ్ జోడీగా ‘జానూ’లో మురిపించింది. ఈ సినిమాల తరువాత వెంకటేశ్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’లో నాయికగా నటించి అలరించారు ఖుష్బూ. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తరువాత “కిరాయి దాదా, కెప్టెన్ నాగార్జున, త్రిమూర్తులు, చిన్నోడు పెద్దోడు, చిన్నికృష్ణుడు, గురుశిష్యులు, అలజడి, శాంతి క్రాంతి, పేకాట పాపారావు” వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు ఖుష్బూ. అయితే తమిళనాట హీరో ప్రభుకు హిట్ పెయిర్ గా సాగారు. వారిద్దరూ నటించిన ‘చిన్న తంబి’ బంపర్ హిట్. ఆ సినిమా ఆధారంగానే తెలుగులో వెంకటేశ్ ‘చంటి’ రూపొందింది. తమిళంలో అనేక విజయాలను చూసిన ఖుష్బూ తరువాత కేరెక్టర్ రోల్స్ లో అలరించారు.
Also Read
- Varanasi Update: 'వారణాసి' నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
- Shah Rukh Khan: 'నా భర్త కంటే మీరే ఇష్టం'.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
- RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
- Samantha: సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
చాలా రోజుల తరువాత తెలుగులో చిరంజీవి ‘స్టాలిన్’లో ఆయనకు అక్కగా నటించారు ఖుష్బూ. ‘యమదొంగ’లో యమునిగా నటించిన మోహన్ బాబుకు జంటగా కనిపించారు. ‘అజ్ఞాతవాసి’లో హీరోకు సవతి తల్లిగా అభినయించారు. ఈ యేడాది ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ అనే తెలుగు చిత్రంలోనూ ఖుష్బూ నటించారు. తమిళ దర్శకుడు సి.సుందర్ ను వివాహమాడిన ఖుష్బూకు ఇద్దరు పిల్లలు. రాజకీయాల్లోనూ అడుగు పెట్టిన ఖుష్బూ మొదట్లో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారు. చిత్రంగా అదే పార్టీలో చేరి మొన్న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. అయితే హిందుత్వ సంఘాలే ఖుష్బూను వ్యతిరేకించడం గమనార్హం. ఈ ఎన్నికలో ఖుష్బూ ఓటమి చవిచూశారు. ఇప్పటికీ బీజేపీలోనే కొనసాగుతున్నారామె. తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయాలని ఈ నాటికీ తపిస్తూనే ఉన్నారు ఖుష్బూ.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!