Monsoon Diet :వర్షాకాలంలో నాన్ వెజ్ ను ఎక్కువగా తింటున్నారా? ఇది మీసమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ కాలం అయిన నాన్ వెజ్ ప్రియులు నాన్ వెజ్ తినకుండా అస్సలు ఉండలేరు.. వర్షాలు పడుతుంటే ఎవరికైనా స్పైసిగా తినాలని అనుకుంటారు.. అందులోను నాన్ వెజ్ ఐటమ్స్ ను ఎక్కువగా తింటారు.. అయితే వర్షాకాలంలో నాన్ వెజ్ ను తీసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు..అన్ని కాలాల్లోనూ మన జీర్ణ వ్యవస్థ ఒకే మాదిరిగా ఉండదు. అందుకే సీజనల్ ఫుడ్ తీసుకోవాలని చెప్తుంటారు న్యూట్రిషనిస్టులు. మనకు దొరికే కూరగాయలు, పండ్లు కూడా సీజన్ బట్టి ఉంటాయి..వర్షాకాలంలో అన్ని రకాల కూరగాయలు పుష్కలంగా దొరుకుతాయి. ఆరోగ్యాన్ని పెంచే ఈ కూరగాయలను వదిలి, నాన్ వెజ్ ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
కోడి గుడ్డు.. రోజుకు ఒక గుడ్డు తినాలని డాక్టర్లు సూచిస్తారు.. కానీ వర్షా కాలంలో మాత్రం దూరంగా ఉండాలని చెబుతున్నారు..వ్యాధి కారక క్రిములు వర్షాకాలంలో వ్యాపించే అవకాశం ఎక్కువ. కోడిగుడ్లలో ఉండే తేమ వల్ల వీటి వ్యాప్తికి అవి అనుకూలంగా ఉంటాయి. టైఫాయిడ్ బాక్టీరియా అయిన సాల్మొనెల్లా, ఎశ్చరీషియాకోలి ఎక్కువగా వ్యాపిస్తాయి. అందుకే టైఫాయిడ్, డయేరియా వ్యాధులు వేగంగా వ్యాపిస్తుంటాయి. గుడ్లు ఫుడ్ పాయిజనింగ్ కు కారణమై కడుపు నొప్పి, అజీర్తి లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి గుడ్డు వాడకపోవడమే బెటర్. తినాలనుకుంటే మాత్రం ఆమ్లెట్ గా కన్నా ఉడికించిన గుడ్డు తీసుకోవడం మంచిది..
Also Read
- Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
- Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
- Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
- Food Facts: చిల్లు గారెలో చిల్లు ఎందుకు పెడతారో తెలుసా? దాని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
మాములుగా వర్షాకాలంలో మటన్ షాపుల్లో తాజా మాంసం దొరకడం కష్టం. కొన్నిసార్లు చనిపోయిన కోడి మాంసాన్ని అమ్మవచ్చు. చికెన్ కొనేటప్పుడు దానిపై మచ్చలు లేదా తెల్లటి గీతలు ఉంటే దానికి ఏదైనా వ్యాధి లేదా ఇన్ ఫెక్షన్ ఉందని అర్థం. అలాంటివి కొనొద్దు. మాంసం జిగటగా ఉండకుండా మెరుస్తూ, దృఢంగా ఉంటేనే తాజాదని భావించాలి. ఇక దాన్ని వండేటప్పుడు ముందుగా గోరువెచ్చని నీటిలో పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి… అప్పుడే వాటికి ఉన్న క్రీములు పోతాయి.. అలాగే చేపలను కూడా తినకూడదని నిపుణులు చెబుతున్నారు.. అంటే కూరగాయలు లతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!