Detoxification : మలబద్దకానికి చెక్ పెడదాం.. ఈ చిట్కాలతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శరీరంలో ఏర్పడే మలిన పదార్ధాలను బయటకు పంపే సహజ వ్యవస్థ మన శరీరంలో ఉంది. విషపదార్థాలను శరీరం నుంచి విసర్జించాడాన్ని డేటాక్సిఫికేషన్ అంటారు. అయితే అత్యుత్సాహంతో తినే అనవసరం పదార్థాల వల్ల అనేక విషపూరిత పదార్థాలు ఏర్పడతాయి. వాటిని విసర్జించాలి అంటే శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వాలి. ఆ విశ్రాంతి ఉపవాసం వల్ల సులువుగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలలో లభిస్తుంది. అల్కహాల్ రసాయనిక పదార్థాలు, ఫాస్ట్పుడ్స్, అధిక మసాలలతో ఉన్న ఆహారము ద్వారా ఏర్పడే ఇతర విషపూరిత వాయువులు, విష పదార్థాలు ఏవైనా కావచ్చు.
ఇవి శరీరంలో పేరుకు పోతే సహజ శరీర విసర్జక వ్యవస్థ పని చాలా కష్టం అవుతుంది. అందువల్ల జీవన చర్యలు మందగిస్తాయి. ఫలితంగా జీర్ణ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, విసర్జక అవయవం ముల పని తీరు అస్తవ్యస్తం అవుతుంది. చర్మం మీద పొక్కులు, తట్టు, కీళ్ల నొప్పులు, జీర్ణము వంటివి అలసటను కలగచేస్తాయి. విసర్జక అవయవాలైన కాలేయం, మూత్రపిండాలు, పేగుల పని భారము ఎక్కువై దెబ్బతింటాయి. ఇతర ముఖ్య అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు, మెదడు కూడా దీని ప్రభావానికి లోనే ఇబ్బంది పెట్టె అనేక వ్యాధులు కలుగుతాయి.
Also Read
- Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
- Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
ఎలా తప్పించుకోవాలి..?
ఈ వ్యవస్థకు మూలకారణమైన పదార్ధాలను తినకూడదు. సహజసిద్ధమైన సులువుగా జీర్ణం అయ్యే ఆహారాన్ని మితముగా తీసుకోవాలి. ఉపవాసము చేసి పండ్లు, తాజా పండ్ల రసాలు త్రాగడం వలన ఒకటి రెండు రోజుల్లో విషపదార్థాలను బయటకు పంపి చేయవచ్చు.
తినకూడని పదార్థాలు..
మాంసము, పాల ఉత్పత్తులు, అల్కాహాల్, ప్రాసెస్ చేసిన తీపి పదార్ధములు, వేపుళ్ళు, ఊరగాయలు, అనవసరముగా చీటికి మాటికి మందులు వాడ రాదు.
తినవలసిన పదార్థములు..
తాజా పండ్లు, కూరలు, ఆకుకూరలు వల్ల మూలికలతో చేసిన పానీయాలు, బాదం, వాల్నట్, జీడిపప్పు, పొద్దుతిరుగుడు, గుమ్మడి విత్తనాలు, బ్రౌన్ రైస్, గోధుమ జొన్నలతో చేసిన ఆహార పదార్థాలతో పాటు ఎక్కువగా నీళ్లు తాగాలి. వీటితో పాటు విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ ఈ, సెలెనియమ్, వంటి విటమిన్లు తీసుకుంటూ ఉండాలి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, డయాబెటీస్, లోబీపీ, ఫుడ్ అలర్జీ ఉన్నవారు ఉపవాసము చేయకూడదు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!