Nipah Virus: అసలేంటి “నిపా వైరస్”.. దీనికి చికిత్స ఉందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nipah Virus: నిపా వైరస్ ఇప్పుడు కేరళ రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. ముఖ్యంగా కోజికోడ్ జిల్లాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి ఐదుగురికి సోకింది. ఇందులో ఇద్దరు మరణించడంతో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటోంది. ఏడు గ్రామ పంచాయతీలను పూర్తిగా దిగ్భందించింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. గతంలో కూడా కేరళను నిపా వైరస్ బాధించింది. తాజాగా మరోసారి ఆ రాష్ట్రంపై విరుచుకుపడుతోంది. కొత్తగా వచ్చిన నిఫా వేరియంట్ ‘‘బంగ్లాదేశ్ వేరియంట్’’అని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించింది.
1998లో మలేషియా, సింగపూర్ లోని పందుల పెంపకందారులలో మొదటిసారిగా ఈ నిపా వైరస్ని గుర్తించారు. గబ్బిలాలు, పందుల శరీర ద్రవాలైన లాలాజలం, మూత్రం వంటి వాటితో మనుషులకు వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన మనుషుల నుంచి ఇతర మనుషులకు సోకుతుంది. గబ్బిలాల్లో నిపా వైరస్ చాలా ఏళ్లుగా ఉందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. గబ్బిలాల్లో వైరస్ మ్యుటేషన్లు చెంది, అత్యంత వ్యాప్తి చెందే వేరియంట్ గా పరివర్తన చెందుతోంది.
Also Read
- Ragi Aratikaya Bajji: రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. సాయంత్రం పూట సింపుల్గా ఇలా హెల్తీ స్నాక్స్ చేసుకోండి
- Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
- Health Tips : రాత్రి పిండి.. ఉదయం రొట్టె..? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
- Ragi Vadiyalu: అమ్మమ్మల కాలం నాటి టేస్ట్.. హెల్తీ రాగి వడియాలను సింపుల్గా ఇలా చేసుకోండి!
Read Also: Uttar Pradesh: కోడలిపై మామ అత్యాచారం.. విడిచిపెట్టిన భర్త..
లక్షణాలు, చికిత్స:
నిపాను త్వరగా గుర్తించి చికిత్స తీసుకోకుంటే ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. అయితే ఈ వ్యాధిని నయం చేయడానికి టీకాలు లేవు. దీన్ని నివారించేందుకు వ్యాక్సిన్లు కానీ, నయం చేయడానికి సరైన మందులు కానీ లేవు. వ్యాధి సోకిన 70 శాతం మరణాల రేటు ఉంటుంది. వ్యాధి వలన కలిగే లక్షణాలను అనుసరించి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. వ్యాధి సోకిన వ్యక్తులు మొదట్లో జ్వరం, శ్వాసకోశ బాధ, తలనొప్పి మరియు వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. మెదడు వాపు , మూర్చ వంటి తీవ్రమైన లక్షణాలు ఉంటాయి. ఒక్కోసారి కోమాకు దారి తీస్తుంది.
ముందుగా ఎక్కడ వ్యాపించింది:
మలేషియా, సింగపూర్ దేశాల్లో 1998 లో నిపా వైరస్ వ్యాప్తి చెందింది. దాదాపుగా 300 మందికి సోకితే 100 కన్నా ఎక్కువ మందిని బలి తీసుకుంది. సోకిన వారిలో 72% మరియు 86% మంది మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం.. 1998 నుండి 2015 మధ్యకాలంలో 600 కంటే ఎక్కువ మందికి నిపా వైరస్ సోకింది. 2001లో ఇండియా, బంగ్లాదేశ్ లో నిపా బయటపడింది. 2018లో కేరళలో ఈ వ్యాధి బయటపడింది. ఆ సమయంలో ఈ వ్యాధి వల్ల 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019, 2021 మరోసారి కేసులు బయటపడ్డాయి. తాజాగా మరోసారి కేరళ రాష్ట్రాన్ని కలవరపెడుతుంది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..