Fairness Cream: ఫెయిర్నెస్ క్రీమ్లతో భారత్లో పెరుగుతున్న కిడ్నీ సమస్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fairness Cream: భారతదేశంలో చాలా మంది ఫెయిర్నెస్ క్రీములు వాడటం అలవాటుగా మారింది. చర్మం నిగారింపుగా కనిపించాలని చాలా మంది వీటిని వాడుతున్నారు. అయితే, వీటి వల్ల భారత్లో కిడ్నీ సమస్యలు పెరుగున్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. భారతదేశం ఫెయిర్నెస్ క్రీమ్లకు లాభదాయకమైన మార్కెట్గా ఉంది. అయితే, వీటిల్లో ఉండే పాదరసం వల్ల మూత్రపిండాలకు హాని కలిగిస్తోంది.
కిడ్నీ ఇంటర్నేషనల్ అనే మెడికల్ జర్నల్లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. ఈ క్రీముల్లో ఎక్కువగా పాదరసం ఉండటంతో మెంబ్రానస్ నెఫ్రోపతి(ఎంఎన్) కేసులు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితి కిడ్నీ ఫిల్టర్లను దెబ్బతీస్తుంది. ప్రోటీన్ లీకేజీలకు కారణమవుతోంది. ఎంఎన్ అనేది ‘ఆటోఇమ్యూన్ డిజీజ్’’, దీని ఫలితంగా నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఏర్పడుతోందని, దీని వల్ల శరీరం నుంచి అధిక ప్రొటీన్ విసర్జింపబడుతోందని స్టడీ తేల్చింది.
Also Read
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ 'జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
- PCODతో ఇబ్బందా.? మెంతులు-దాల్చినచెక్క టీతో ఇన్సులిన్ బ్యాలెన్స్.!
- Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే 'మష్రూమ్ ఆనియన్ పకోడీ'.! చేసేయండి ఇలా..
పాదరసం చర్మం ద్వారా శరీరంలోకి చేరి, మూత్రపిండాల ఫిల్టర్లను నాశనం చేస్తున్నాయని, ఇది నెఫ్రోటిక్ సిండ్రోమ్ కేసుల పెరుగుదలకు దారి తీస్తుందని పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ సజీష్ శివదాస్ వెల్లడించారు. భారతదేశంలోని పలు క్రీములు, చర్మం రంగుపై త్వరగా ప్రభావం ఉంటుందని ప్రకటనలు ఇస్తాయని, వినియోగాన్ని ఆపడం వల్ల చర్మం మరింత డార్క్ కలర్లోకి మారుతుందని ఆయన చెప్పారు. జూలై 2021, సెప్టెంబర్ 2023 మధ్య నివేదించబడిని 22 ఎంఎన్ కేసులపై అధ్యయనం జరిగింది. అలసట, తేలిక పాటి ఎడేమా, మూత్రంలో నురుగ లక్షణాలతో ఉన్న రోగులని పరిశీలిస్తే.. వీరిలో ముగ్గురు రోగులకు ఎడెమా ఉంది, కానీ మిగిలిన వారిందరిలో మూత్రంలో ప్రోటీన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఒక రోగి మెదడులో రక్తం గడ్డకట్టే సెరిబ్రల్ వెయిన్ థ్రాంబోసిస్ కలిగి ఉన్నాడు.
22 మందిలో 68 శాతం అంటే 15 న్యూరల్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్-1 ప్రోటీన్ (NELL-1)కి ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. ఇది ఎంఎన్ వ్యాధి యొక్క అరుదైన రూపం. ఇది ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉంటుంది. 15 మంది రోగులలో 13 మంది లక్షణాలు కనిపించకముందు స్కిన్ ఫెయిర్నెస్ క్రీమ్లు వాడినట్లు అంగీకరించారు. మిగిలిన వారిలో ఒకరు సాంప్రదాయ స్వదేశీ ఔషధాలను ఉపయోంచిన చరిత్ర ఉంది.
తాజావార్తలు
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!