Dove: పావురాన్ని పెంచుకుంటున్నారా..? చాలా డేంజర్.. మన ప్రాణాలకే ప్రమాదం..
- పావురాల రెక్కల నుంచి ఫంగస్
- పావురం నుంచి వెలువడిన ఈ ఫంగస్ వల్ల ఇన్ఫెక్షన్ ప్రమాదం
- ఈ ఇన్ఫెక్షన్ వల్ల పూర్తిగా రోగి ఊపిరితిత్తులపై ప్రభావం
- ఈ వ్యాధి పేరు హైపర్సెన్సిటివ్ న్యుమోనైటిస్
- పావురాల మలం.. రెక్కల నుంచి వెలువడే ఫంగస్ నుంచే వ్యాధి సోకుతుందని తేల్చిన వైద్యులు
- కుక్కలు మరియు పిల్లుల వల్ల కూడా వ్యాధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీకి చెందిన 11 ఏళ్ల చిన్నారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చిన్నారికి చికిత్స చేయడం ప్రారంభించినప్పుడు.. మొదట్లో ఇది సాధారణ ఇన్ఫెక్షన్ అని వారు భావించారు. కానీ చికిత్స పెరుగుతున్న కొద్దీ.. ఇది ఏదో తీవ్రమైన లక్షణాలని వారికి తెలిసింది. విచారణలో.. ఈ బాబు పావురాలతో సన్నిహితంగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ సమయంలో పావురాల రెక్కల నుంచి ఫంగస్ రావడంతో బాలుడు అస్వస్థతకు గురైనట్లు తేలంది. ఈ రోగికి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు.. చిన్నపాటి ఇన్ఫెక్షన్ మాత్రమే ఉందని, అయితే కొద్ది రోజుల్లో అది బాబు ఊపిరితిత్తులకు బాగా వ్యాపించిందని వైద్యులు చెబుతున్నారు. అతని ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో..హడావిడిగా పెద్దాస్పత్రిలో చేర్చారు. అక్కడ రోగిని పరీక్షించిన వైద్యులు షాకింగ్ ఫలితాలు కనుగొన్నారు. పావురం నుంచి వెలువడిన ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకిన కొద్ది రోజుల్లోనే బాలుడి ఆరోగ్యం వేగంగా క్షీణించడం ప్రారంభించిందని వారు గుర్తించారు. ఇన్ఫెక్షన్ పూర్తిగా రోగి ఊపిరితిత్తులకు వ్యాపించిందని దర్యాప్తు నివేదిక వెల్లడించింది.
READ MORE: Rakshit Shetty: అరెస్ట్ భయం.. బెయిలివ్వమంటూ కోర్టుకు రక్షిత్ శెట్టి
Also Read
- 5 Best Salads for Glowing Skin: సింపుల్గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
- Ragi Aratikaya Bajji: రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. సాయంత్రం పూట సింపుల్గా ఇలా హెల్తీ స్నాక్స్ చేసుకోండి
- Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
- Health Tips : రాత్రి పిండి.. ఉదయం రొట్టె..? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
వైద్యుల ప్రకారం.. ఈ వ్యాధిని హైపర్సెన్సిటివ్ న్యుమోనైటిస్ (HP) అని పిలుస్తారు. దీని వ్యాప్తికి అతిపెద్ద కారణం పావురాల ఈకలు మరియు మలం నుంచి బయటకు వచ్చే ఫంగస్. హెచ్పితో బాధపడుతున్న ఈ రోగి ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడుతోందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆక్సిజన్ తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నాడని.. నిరంతరం ఆక్సిజన్ అందిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా అవసరాన్ని బట్టి స్టెరాయిడ్స్ కూడా ఇస్తున్నారు.
READ MORE: CBRE: ఈ ఏడాది దేశంలో భారీగా పెరిగిన లగ్జరీ ఇళ్ల విక్రయాలు..హైదరాబాద్ లో ఎన్ని యూనిట్లంటే..?
ఇన్ఫెక్షన్ ప్రాణాంతకం కావచ్చు….
ఢిల్లీ ఎన్సీఆర్లో పావురాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు ప్రతి ఇల్లు, పాఠశాల, కళాశాల, ఆసుపత్రి మొదలైన వాటి బాల్కనీలో పావురాలు కూర్చుని ఉంటాయి. కొంతమంది పావురాలకు గింజలు కూడా తినిపిస్తారు. ఢిల్లీ మరియు నోయిడాలోని అనేక ప్రదేశాలలో, ప్రజలు పావురాలకు ఆహారం ఇస్తారు. ఇది హైదరాబాద్ లో కూడా జరుగుతుంది. దీని కారణంగా పావురాలు ఆ ప్రదేశాలలో గుమిగూడడం ప్రారంభిస్తాయి. దాని మలం, రెక్కల నుంచి వచ్చే వ్యర్థాల వల్ల ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయి. పావురం, కుక్క, పిల్లి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ కూడా ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు.
READ MORE:IAS Transfers: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ల బదిలీలు..
వ్యాధి మెదడుకు చేరుతుంది
పావురాలు రెక్కలను ఆడించినప్పుడు వాటి నుంచి వచ్చే కణాలు ఇన్ఫెక్షన్కు కారణమవుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇది దీర్ఘకాలికంగా ఉంటే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. కొందరిలో ఈ ఇన్ఫెక్షన్ మెదడుకు చేరి మెనింజైటిస్ కూడా రావచ్చు. ఇది ప్రాణాంతకం. అదేవిధంగా, కుక్కలు మరియు పిల్లులు కూడా తమ జుట్టును కోల్పోతాయి. ఈ వెంట్రుకలు చాలా తేలికగా ఉంటాయి. అవి శ్వాస తీసుకున్నప్పుడు ముక్కు నుంచి ఊపిరితిత్తులకు వెళ్తాయి. ఇది కూడా చాలా ప్రమాదకరం.
తాజావార్తలు
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..